Moviesచిరంజీవితో కీర్తి సురేష్ తల్లికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..??

చిరంజీవితో కీర్తి సురేష్ తల్లికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..??

పక్కింటి అమ్మాయిలా … అమాయకంగా కనిపించే కీర్తి సురేష్ తెలుగులో అనేక హిట్ సినిమాల్లో నటించి మెప్పించి. తెలుగు లో ‘నేను శైలజ’సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ లో అచ్చమైన తెలుగు అమ్మాయిగా అందరి మనసు దోచింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’సినిమాతో తెలుగు, తమిళంలో తిరుగులేని స్టార్ డమ్ తెచ్చుకుంది.

ఇక ఆమె కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ “మహా నటి” సావిత్రి పాత్రలో ఆమె చాలా చక్కగా ఒదిగిపోయింది. ఆ సినిమాలో కీర్తి కనిపించలేదు సావిత్రి మాత్రమే ప్రేక్షకులకు కనిపించింది. ఈ సినిమాలో వేరే హీరోయిన ని ఎవరిని పెట్టిన ఈ పాత్రకు కీర్తి చేసిన న్యాయం చేయలేరు అనేంతాల కీర్తి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. దీన్నిబట్టి ఆమె ఏ రేంజ్ లో పెరఫామెన్స్ చేసిందో అందరికి అర్ధం అయిపొయింది.

ఇక కీర్తి సురేష్ తల్లి మేనక గురించి మనకు తెలిసందే. అయితే, ఆమె ఒకప్పుడు సినిమాలో నటించిందని.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో కూడా జతకట్టిందని చాలా మందికి తెలియకపోవచ్చు. అవును..చిరంజివి..కీర్తి సురేష్ తల్లి మేనక కలిసి సినిమాలో నటించారొ. ఆ సినిమా సూపర్ హిట్ కూడా అయ్యింది. ఇమతకి ఆ సినిమా ఏంటో తెలుసా..??..”పున్నమినాగు”. చిరంజీవి కెరీర్‌ను మలుపు తిప్పిన ‘పున్నమినాగు’ సినిమాలో మేనక హీరోయిన్‌గా నటించారు.

అయితే కీర్తి సురేష్ తల్లి మేనక..తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి దాదాపు వందకుపైగా చిత్రాల్లో నటించారు. ఇంద్రధనస్సు, సుబ్బారావుకు కోపం వచ్చింది లాంటి తెలుగు చిత్రాల్లో ఆమె నటించారు. కెరీర్లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రముఖ నిర్మాత జి.సురేష్‌ కుమార్‌ని వివాహం చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పేశారు మేనక. వీరికి ఇద్దరు కూతుళ్లు. కీర్తి సురేష్‌ మలయాళంలోనే అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రస్తుతం దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news