Newsవిజ‌య‌వాడ కాల్పుల్లో యువ‌కుడు మృతి... స్కెచ్ మామూలుగా లేదుగా..!

విజ‌య‌వాడ కాల్పుల్లో యువ‌కుడు మృతి… స్కెచ్ మామూలుగా లేదుగా..!

ఏపీ రాజ‌ధాని ఏరియాకు కేంద్ర బిందువుగా ఉన్న విజ‌య‌వాడ న‌గ‌రంలో శ‌నివారం అర్ధ‌రాత్రి జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. శ‌నివారం అర్ధ‌రాత్రి న‌గ‌రు శివారు ప్రాంతంలో బైపాస్ రోడ్డులోని సుబ్బారెడ్డి బార్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స్కూట‌ర్‌పై వ‌చ్చిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఒక్క‌సారిగా అక్క‌డ ఉన్న మ‌హేష్ అనే యువ‌కుడిపై కాల్పులు జ‌రిపారు. ఏం జ‌రిగింద‌ని ప‌క్క‌నే ఉన్న వారు గుర్తించే లోగానే కాల్పులు జ‌రిపిన దండుగులు అక్క‌డ నుంచి ప‌రార‌య్యారు.

 

కాల్పులు జ‌రిగిన ప్రాంతాన్ని న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు ప‌రిశీలించారు. హ‌త్య‌కు గురైన మ‌హేష్ విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌రేట్‌లో అటెండ‌ర్‌గా ప‌ని చేస్తున్న‌ట్టు గుర్తించారు. విజ‌య‌వాడ పోలీసులు నిందితుల కోసం ప్ర‌త్యేక బృందాల‌తో రంగంలోకి దిగారు. ప‌క్కా ప్లానింగ్‌తోనే దండుగులు మ‌హేష్ ఎక్క‌డ ఉన్నాడో తెలుసుకుని రెప్పాటులో కాల్చేసి వెళ్లిపోయారు.

 

ఇక మ‌హేష్ హ‌త్య‌కు కార‌ణం రియల్‌ ఎస్టేట్‌ వివాదం కారణం అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాల్పులు జరిగే సమయంలో మ‌హేష్‌తో ఉన్న మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు ప‌రారీలో ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌తో న‌గ‌ర వాసులు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news