Moviesవామ్మో బుట్ట‌బొమ్మో.... ఇంత‌లా రేటు పెంచేస్తే ఎలా..!

వామ్మో బుట్ట‌బొమ్మో…. ఇంత‌లా రేటు పెంచేస్తే ఎలా..!

అప్పుడెప్పుడో కొన్నేళ్ల క్రితం సౌత్‌లో జీవా ప‌క్క‌న మాస్క్ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన పూజా హెగ్డే.. ఆ త‌ర్వాత తెలుగులో నాగచైత‌న్య ప‌క్క‌న ఒక లైలా కోసం సినిమాలో న‌టించింది. ఆ తర్వాత ఆమె మ‌హేష్‌, బ‌న్నీ, ఎన్టీఆర్‌, వ‌రుణ్ తేజ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది యంగ్ హీరోల ప‌క్క‌న న‌టించి బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టేస్తోంది. ఇక ఈ యేడాది వ‌చ్చిన అల వైకుంఠ‌పుర‌ములో సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఆమె క్రేజ్ స్కై రేంజ్‌లో ఉంది.

 

వ‌రుస హిట్ల‌తో పాటు స్టార్ హీరోలు ఆమెనే త‌మ సినిమాల్లో రిపీట్ చేస్తుండ‌డంతో ఆమె రేటు పెంచేసి కొండెక్కి కూర్చొంది. ప్ర‌స్తుతం ఆమె ప్ర‌భాస్ ప‌క్క‌న రాధేశ్యామ్‌, అఖిల్ ప‌క్క‌న మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ సినిమాల్లో న‌టిస్తోంది. ఈ రెండు సినిమాల త‌ర్వాత మ‌రోసారి త్రివిక్ర‌మ్ – ఎన్టీఆర్ సినిమాలోనూ ఆమెకే ఛాన్స్ అంటున్నారు. చ‌ర‌ణ్ ప‌క్క‌న ఓ సినిమాలో న‌టించ‌నుంది.

 

దీంతో ఆమె సినిమాకు రు. 2 కోట్ల‌కు ఏ మాత్రం త‌గ్గేది లేద‌ని చెపుతోంద‌ట‌. ఇప్పుడున్న క‌రోనా ప‌రిస్థితుల్లో కాస్త రేటు త‌గ్గించుకోమ‌ని నిర్మాత‌లు అడుగుతున్నా కూడా ఆమె ఏ మాత్రం బెట్టువీడ‌డం లేద‌ట‌. బెల్లంకొండ శ్రీనివాస్ ప‌క్క‌న సాక్ష్యం సినిమా చేసినందుకు రు 1. 5 కోట్లు తీసుకున్న పూజ ఇప్పుడు అల దెబ్బ‌తో రు. 2 కోట్లు డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు పూజా రెమ్యున‌రేష‌న్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news