Newsబ్రేకింగ్‌: ఇద్ద‌రు కేంద్ర మంత్రుల‌కు కోవిడ్ పాజిటివ్‌

బ్రేకింగ్‌: ఇద్ద‌రు కేంద్ర మంత్రుల‌కు కోవిడ్ పాజిటివ్‌

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇక మ‌న దేశంలో రోజు రోజుకు రికార్డు స్థాయిలో కోవిడ్ పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇప్ప‌టికే అనేక మంది ప్ర‌జాప్ర‌తినిధుల‌కు కోవిడ్ పాజిటివ్ సోకింది. ఈ క్ర‌మంలోనే తిరుప‌తి ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ సైతం కరోనాతో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఇక ప‌లువురు ఎంపీలు సైతం క‌రోనా భారీన ప‌డ్డారు. ఇక కేంద్ర మంత్రులు వ‌రుస‌గా క‌రోనా భారీన ప‌డుతున్నారు.

 

ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రు కేంద్ర‌మంత్రులు రెండు రోజుల వ్య‌వ‌ధిలో క‌రోనాకు గుర‌య్యారు. నిన్న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకగా.. తాజాగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కు కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌తో క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింద‌ని ఆయ‌న తెలిపారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు సుమారు ఏడుగురు కేంద్ర మంత్రుల‌కు క‌రోనా వ‌చ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news