Newsప్ర‌కాశం జిల్లాలో టీడీపీకి ఎదురు దెబ్బ‌... టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటికి షాక్‌

ప్ర‌కాశం జిల్లాలో టీడీపీకి ఎదురు దెబ్బ‌… టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటికి షాక్‌

ప్ర‌కాశం జిల్లాలో టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌కు బ‌ల‌మైన అనుచ‌రుడిగా ఉన్న సంత‌మాగ‌లూరు మండలం మాజీ జెడ్పీటీసీ చింతా రామారావుతో పాటు ప‌లువురు కీల‌క నేత‌లు వైఎఎస్సార్‌సీపీలో చేరారు. మండలంలోని వెల్లలచెరువు గ్రామానికి చెందిన టీడీపీ నేత, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చింతా రామారావుతో పాటు అత‌డి వ‌ర్గం మొత్తం విజ‌య‌వాడ‌లో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య  సమక్షంలో వైసీపీ కండువాలు క‌ప్పుకున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్రం అంత‌టా వైసీపీ ప్ర‌భంజనం క్రియేట్ చేసినా అద్దంకిలో మాత్రం గొట్టిపాటి ర‌వికుమార్ మూడోసారి గెలిచి హ్య‌ట్రిక్ కొట్టారు. ఆయ‌న ఓట‌మి లేకుండా నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఈ సారి అద్దంకిపై గ‌ట్టిగా గురి పెట్టిన జ‌గ‌న్ ఆ బాధ్య‌త‌ను మంత్రి బాలినేనికి అప్ప‌గించారు. దీంతో బాలినేనితో పాటు నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జ్ బాచిన కృష్ణ‌చైత‌న్య‌, మాజీ ఎమ్మెల్యే గరటయ్య ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ర‌వి అనుచ‌రుల‌ను వైసీపీలో చేర్పించే ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news