Moviesఅడ‌వి దత్త‌త తీసుకున్న ప్ర‌భాస్‌... ఖ‌ర్చు ఎన్ని కోట్లో తెలుసా..!

అడ‌వి దత్త‌త తీసుకున్న ప్ర‌భాస్‌… ఖ‌ర్చు ఎన్ని కోట్లో తెలుసా..!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌న తండ్రి స్మార‌కంగా తెలంగాణ రాష్ట్ర ప‌రిధిలో ఉన్న ఖాజీప‌ల్లి అర్బ‌న్ ఫారెస్ట్ ద‌త్త‌త తీసుకున్నాడు. ఔట్ రింగ్ రోడ్డుకు ప‌క్క‌నే 1650 ఎక‌రాల‌ విస్తీర్ణంలో ఈ అట‌వీ భూమి ఉంది. దీనిని అభివృద్ధి చేసేందుకు ప్ర‌భాస్ ప్రాధ‌మికంగా రు. 2 కోట్లు ఖ‌ర్చు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. అవ‌స‌రాన్ని బ‌ట్టి ఈ ఖ‌ర్చు పెరిగినా భ‌రించేందుకు ప్ర‌భాస్ రెడీగానే ఉన్నాడ‌ట‌. ఇక ఈ అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించి సోమ‌వారం శంకుస్తాప‌న కార్య‌క్ర‌మం కూడా పూర్త‌య్యింది.

తెలంగాణలో గ‌త కొంత కాలంగా గ్రీన్ ఛాలెంజ్ పేరుతో రాజ్య‌స‌భ స‌భ్యుడు సంతోష్‌కుమార్ ఓ య‌జ్ఞాన్ని నిర్వ‌హిస్తున్నాడు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంతో మంది పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలోనే సంతోష్ చొర‌వ‌తోనే ప్ర‌భాస్ ఈ ద‌త్త‌త కార్య‌క్ర‌మం తీసుకున్నాడ‌ట‌. ఈ ప్రారంభ కార్య‌క్ర‌మంలో తెలంగాణ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news