Politicsపెళ్లీడు కొచ్చిన కుమార్తెల ముందే బ్లూ ఫిల్మ్‌లు... కాకినాడ‌లో శాడిస్ట్ భ‌ర్త...

పెళ్లీడు కొచ్చిన కుమార్తెల ముందే బ్లూ ఫిల్మ్‌లు… కాకినాడ‌లో శాడిస్ట్ భ‌ర్త ఏం చేశాడంటే…

తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ మండ‌లం కొవ్వూరులో దార‌ణం జ‌రిగింది. పెళ్లీడు కొచ్చిన ఇద్ద‌రు కుమార్తెల ముందే ఓ శాడిస్ట్ భ‌ర్త మద్యం సేవించి వ‌చ్చి బ్లూ ఫిల్మ్‌లు చూస్తున్నాడు. ప్ర‌తి రోజు ఇదే తంతు జ‌రుగుతోంది. కుమార్తెల ముందే అశ్లీల చిత్రాలు చూస్తూ భార్య‌ను, కుమార్తెల‌ను చిత్ర హింస‌ల‌కు గురి చేస్తున్నాడు. దీనిపై ప్ర‌శ్నించిన భార్య‌పై చేయి చేసుకున్నాడు.

భార్య ఫిర్యాదు చేసిన వివ‌రాల ఆధారంగా ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తోన్న దంగేటి శ్రీను కొంత కాలంగా మ‌ద్యానికి బానిస అయ్యాడు. ఫూటుగా తాగి వ‌చ్చి ఇంటికి వ‌చ్చాక కుమార్తెల ముందే బ్లూ ఫిల్మ్‌లు చూసేవాడు. ఈ విష‌య‌మై భార్య మాధ‌వి శ్రీనుతో ఎన్నోసార్లు గొడ‌వ ప‌డింది. రెండు రోజుల క్రితం కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. దీంతో భార్య త‌ల‌పై డంబెల్‌తో కొట్టాడు. కుమార్తెలు అమ్మ‌ను కొట్ట‌వ‌ద్ద‌ని అడ్డుకున్నా వారిని తోసేశాడు.

త‌ల్లిని కొడుతోన్న దృశ్యాలు కుమార్తెలు వీడియోలు తీయ‌డంతో అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. గ‌తంలోనూ ఆమె భ‌ర్త నుంచి త‌న‌కు, కుమార్తెల‌కు హానీ ఉంద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా జాబ్ పోతుంద‌ని ఉప‌సంహారించుకుంది. ఇక ఇప్పుడు మ‌ళ్లీ ఇంద్ర‌పాలెం స్టేష‌న్లో ఫిర్యాదు చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news