Moviesహీరోయిన్ ఇంట్లో బంగారం మాయం... కొట్టేసింది ఎవ‌రంటే

హీరోయిన్ ఇంట్లో బంగారం మాయం… కొట్టేసింది ఎవ‌రంటే

కోలీవుడ్ న‌టి గాయ‌త్రి సాయినాథ్ ఇంట్లో బంగారం మాయ‌మైంది. ఆమె ఇంట్లో నుంచి ఏకంగా 111 గ్రాముల బంగారం మిస్ అయ్యింద‌ట‌. ఈ బంగారాన్ని ఆమె ఇంట్లో ప‌నిచేస్తోన్న న‌ర్సే అప‌హ‌రించిన‌ట్టు తేల‌డంతో న‌ర్సును పోలీసులు ఆమెను ప‌ట్టుకుని క‌ట‌క‌టాల్లో పెట్టారు. గాయ‌త్రి సాయినాథ్ చెన్నై రాయ‌పేట‌లోని ల‌య‌డ్స్ రోడ్డు వీథిలో ఉంటోంది. ఆమె త‌ల్లి వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతు ఉండ‌డంతో ఆమెకు సేవ‌లు చేసేందుకు ఓ న‌ర్సును నియ‌మించుకుంది.

ఈ క్ర‌మంలోనే ఆమె ఇంట్లో 111 గ్రాముల బంగారం చోరికి గురైన‌ట్టు ఆమె గుర్తించి రాయ‌పేట పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. గాయ‌త్రి ఫిర్యాదు మేర‌కు పోలీసులు ప్ర‌త్యేక బృందాలుగా ఏర్ప‌డి ద‌ర్యాప్తు చేప‌ట్ట‌గా స‌మీపంలోని సీసీ కెమేరాలు ప‌రిశీలించ‌గా ఆమె ఇంట్లో ప‌నిచేస్తోన్న న‌ర్సే ఆ బంగారం ఫిర్యాదు చేసిన‌ట్టు గుర్తించారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆ నర్సు దొంగిలించిన బంగారం తాక‌ట్టు పెట్ట‌డంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని గాయ‌త్రికి అంద‌జేశారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news