Newsపాకిస్తాన్‌, అప్ఘ‌నిస్తాన్‌కు తెలంగాణ తాక‌ట్టు.. బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పాకిస్తాన్‌, అప్ఘ‌నిస్తాన్‌కు తెలంగాణ తాక‌ట్టు.. బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొద్ది రోజులుగా కేసీఆర్‌పై తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేస్తోన్న సంజ‌య్ తాజాగా మ‌రోసారి ఫైర్ అవుతూ తెలంగాణ విమోచ‌న దినోత్స‌వం అధికారికంగా నిర్వ‌హించాల‌న్న డిమాండ్‌తో తెలంగాణ బీజేపీ యాత్ర మొద‌లు పెట్టింద‌ని అన్నారు. కేసీఆర్ తోపుగాడు, మొనగాడు అని స్వంత పేపర్లో డబ్బా కొట్టుకుంటూ ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డం మిన‌హా, ఆయ‌న తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చేసిందేమీ లేద‌ని సంజ‌య్ విరుచుకు ప‌డ్డారు.

కేసీఆర్ తెలంగాణ‌లో పొడ్చింది ఏంటి ?  దేశంలో పొడ్చింది ఏంట‌ని సంజ‌య్ ప్ర‌శ్నించారు. తెలంగాణ‌ను కేసీఆర్ రాచ‌కారుల పార్టీ అయిన ఎంఐంకు తాక‌ట్టు పెట్టార‌ని.. ఇప్పుడు దేశాన్ని పాకిస్థాన్,ఆఫ్ఘనిస్తాన్ తాకట్టు పెట్టేందుకు దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వస్తున్నారని విమర్శలు చేసారు. ఇక దేశంలోనే ధ‌నిక రాష్ట్ర‌మైన తెలంగాణ‌ను అప్పుల రాష్ట్రంగా మార్చేశార‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. ఇక కేసీఆర్ పేద‌ల‌కు ఇళ్లు ఇవ్వ‌డు… వాళ్లు ఇళ్లు క‌ట్టుకోకుండా చేసేందుకే ఎల్ఆర్ఎస్ తెచ్చాడని పేర్కొన్నారు.

ఇక కేసీఆర్ కుటుంబ స‌భ్యుల చేతిల్లో బంజారాహిల్స్, కొండాపూర్, హైటెక్ సిటీ ఉన్న విలువైన భూములను కాపాడుకునేందుకు ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చారని సంజ‌య్‌ మండిపడ్డారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news