Moviesసుశాంత్‌కు గంజాయి, మ‌ద్యం అల‌వాటు ఉంది.. రియా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సుశాంత్‌కు గంజాయి, మ‌ద్యం అల‌వాటు ఉంది.. రియా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో ఓ వైపు అత‌డి ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటుంటే మ‌రోవైపు ఆమె సుశాంత్ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌కలంగా మారింది. రియా చ‌క్ర‌వ‌ర్తిపై నార్కోటిక్‌ కంట్రోల్‌ బోర్డు బుధవారం క్రిమినల్‌ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ కేసును ఏకంగా మూడు జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌లు విచార‌ణ చేస్తోన్న వేళ రియా సుశాంత్‌పై ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

ఇక సుశాంత్ వాస్త‌వానికి ప్ర‌తి రోజు గంజాయి తీసుకుంటాడ‌ని.. అలాగే క్ర‌మం త‌ప్ప‌కుండా అత‌డికి మ‌ద్యం తాగే అల‌వాటు ఉంద‌ని చెప్పింది. ఇక సుశాంత్‌పై 2018లో మీటు ఆరోప‌ణ‌లు రావ‌డంతో మాన‌సికంగా చాలా కుంగిపోయేవాడ‌ని.. అత‌డి సినిమాల‌క స‌రైన క్రెడిల్ ల‌భించ‌లేద‌ని కూడా బాధ‌ప‌డేవాడ‌ని చెప్పింది. అలాగే సుశాంత్ దిశా సాలియ‌న్ మ‌ర‌ణంపై ఎలా ఫీల్ అయ్యాడో మాత్రం త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పింది.

ఇక తాను మంత్రి ఆదిత్య థాకరేను కలవడం, మాట్లాడడం చేశానని వచ్చిన వార్తలు అవాస్తవం అని చెప్పింది. ఇక సుశాంత్ ఇలాంటి నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నాడో త‌న‌కు ఇప్ప‌ట‌కీ అర్థం కావ‌డం లేద‌ని రియా చెప్పింది. ఏదేమైనా రియా చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై సుశాంత్ అభిమానుల‌తో పాటు టోట‌ల్ సినీ ప్రియుల నుంచి తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సుశాంత్ జీవించి ఉన్నన్ని రోజులు అత‌డిని వాడుకుని.. ఇప్పుడు విమ‌ర్శ‌లు చేస్తున్నావ‌ని ఆమెపై సోష‌ల్ మీడియాలో మండిప‌డుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news