Gossipsస‌ర్కారు వారి పాటపై మ‌హేష్ షాకింగ్ డెసిష‌న్‌... షాక్‌లో టాలీవుడ్‌...!

స‌ర్కారు వారి పాటపై మ‌హేష్ షాకింగ్ డెసిష‌న్‌… షాక్‌లో టాలీవుడ్‌…!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా త‌ర్వాత న‌టిస్తోన్న సినిమా స‌ర్కారు వారి పాట‌. ఈ సినిమా షూటింగ్ క‌రోనా నేప‌థ్యంలో లేట్‌గా స్టార్ట్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ విష‌యంలో మ‌హేష్ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. స‌ర్కారు వారి పాట షూటింగ్ క‌థానుసారం విదేశాల్లో జ‌ర‌గాల్సి ఉంది. సింగిల్ షెడ్యూల్ ముందుగా ఫారిన్‌లో షూట్ చేయాల‌నుకున్నా క‌రోనా వ‌ల్ల స్టోరీని ఇండియ‌న్ లొకేష‌న్స్‌కు త‌గిన‌ట్టుగా షూట్ చేయాల‌ని అనుకున్నారు.

 

మ‌హేష్ సూచ‌న‌ల మేర‌కు క‌థ‌లో మార్పులు చేసి ఇండియాలోనే సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ చేద్దామ‌ని ద‌ర్శ‌కుడు డిసైడ్ అయ్యాడ‌ట‌. అయితే బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ బెల్ బాటమ్ షూటింగ్ కోసం యూరప్ వెళ్లడంతో ఇప్పుడు మ‌హేష్ సైతం తాను ముందుగా తీసుకున్న నిర్ణ‌యాన్ని మార్చేసిన‌ట్టు టాక్‌. షూటింగ్ ఫారిన్ లొకేష‌న్ల‌లోనే చేద్దామ‌ని.. క‌థ‌లో మార్పులు చేసిన‌ట్టు కాకుండా ఫారిన్ లొకేష‌న్‌కు అనుగుణంగానే ఉంచుదామ‌ని చెప్పాడ‌ట‌.

 

మ‌హేష్ నిర్ణ‌యం ఇలా ఉంటే ఇండ‌స్ట్రీ మాత్రం ఈ టైంలో మ‌హేష్ ఫారిన్ షూటింగ్ చేయాల‌నుకోవ‌డం డేరింగ్ స్టెప్పే అని చ‌ర్చించు కుంటోంది. క‌రోనా నేప‌థ్యంలో చాలా జాగ్ర‌త్త‌ల మ‌ధ్య ఫారిన్ షూటింగ్ చేయాల్సి ఉంది. మెసేజ్ ఓరియంటెడ్‌తో కంప్లీట్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న సర్కారు వారి పాట పై అటు మహేష్ ఫ్యాన్స్ లోనూ ఇటు సినీ అభిమానుల్లోనూ భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news