Gossipsసుశాంత్‌ను రియా ఎలా పిచ్చోడిని చేసిందంటే... సీబీఐ విచార‌ణ‌లో శామ్యూల్ విప్పిన...

సుశాంత్‌ను రియా ఎలా పిచ్చోడిని చేసిందంటే… సీబీఐ విచార‌ణ‌లో శామ్యూల్ విప్పిన గుట్టు

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు ప్ర‌స్తుతం సీబీఐ విచారిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సీబీఐ సుశాంత్ మేనేజ‌ర్ శామ్యూల్ మిరండాను ప్ర‌శ్నిస్తుండ‌గా ప‌లు కీల‌క విష‌యాలు వెల్ల‌డి అవుతున్నాయి. శామ్యూల్‌ను సుశాంత్ ఇంట్లో మేనేజ‌ర్‌గా సుశాంత్ సోదరి ప్రియాంక, అమె భర్త సింగ్ నియమించారట. ఈ టైమ్ లోనే రియా ఎంట్రీ ఇచ్చిందని శ్యామ్యూల్ వెల్లడించాడు. ఇక సుశాంత్ కోస‌మే అంటూ రియా అత‌డి ఇంట్లో భారీగా సెల‌బ్రిటీ పార్టీలు నిర్వ‌హించేద‌ట‌.

ఇందుకోస‌మే ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేయించేద‌ట‌. ఈ క్ర‌మంలోనే శృతి మోడీ సెలబ్రిటీ మేనేజర్ గా అపాయింట్ అయ్యిందని.. ఆ టైంలో రోజూ పార్టీలే జ‌రుగుతుండ‌డంతో రియా సైతం సుశాంత్ ఇంటికి మ‌కాం మార్చేసింద‌ని శామ్యూల్ చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో రియా త‌ల్లిదండ్రులతో పాటు సోద‌రుడు షోవిక్ కూడా సుశాంత్ ఇంటికి త‌ర‌చూ వ‌చ్చేవార‌ట‌. వారానికి మూడు నాలుగ సార్లు పార్టీల పేరుతో ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయించేసేద‌ట‌.

ఆ త‌ర్వాత సుశాంత్‌పై రియా తీవ్ర ఒత్తిడి తీసుకు రావ‌డంతో ఓ పార్టీ తరువాత సుశాంత్ తన ఇంటిని అమ్మేయాలని నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. అయితే అప్పుడే నువ్వు మానసిక చికిత్స కోసం కేర‌ళ వెళ్లాల‌ని రియా సూచించింద‌ట‌. ఆ టైంలో సుశాంత్ తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉండేవాడ‌ని కూడా శామ్యూల్ చెప్పిన‌ట్టు స‌మాచారం. సుశాంత్‌తో భారీగా ఖ‌ర్చులు చేయించి.. షాపింగ్‌లు చేయిస్తూ అత‌డిని తీవ్ర‌మైన ఒత్తిడికి రియా గురి చేసింద‌ని శామ్యూల్ చెప్పాడ‌ని జాతీయ మీడియా టాక్‌.?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news