Gossipsచిరు తర్వాత అతన్ని లైన్ లో పెట్టిన చరణ్..!

చిరు తర్వాత అతన్ని లైన్ లో పెట్టిన చరణ్..!

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలిసిందే. ఇప్పటికే సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయ్యిందట. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సైరా సినిమా అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే కొరటాల శివ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు వరుస హిట్లు కొడుతున్న కొరటాల శివ మరో సోషల్ మెసేజ్ తోనే చిరంజీవితో సినిమా చేస్తున్నాడట.

ఇదిలాఉంటే చిరు సినిమా తర్వాత కొరటాల శివ మళ్లీ రాం చరణ్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. చిరంజీవి సినిమా ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగానే తనకు వచ్చిన ఓ లైన్ చరణ్ తో డిస్కస్ చేశాడట కొరటాల శివ.. కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడట రాం చరణ్. ప్రస్తుతం చరణ్ ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాకా ఇంకా ఏ సినిమా కమిట్ అవలేదు.

2020 జనవరి కల్లా ట్రిపుల్ ఆర్ షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. సో కొరటాల శివ చిరు సినిమా పూర్తి కాగానే వెంటనే చరణ్ కొరటాల శివ సినిమా ఉంటుందన్నమాట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట.. కాజల్, రకుల్ హీరోయిన్స్ గా తీసుకోవాలని కూడా ఫిక్స్ అయ్యారట. సో మొత్తానికి కొరటాల శివ తన స్పీడ్ పెంచాడని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news