Gossipsప్రభాస్‌ మోసంచేశాడా? మోసపోయాడా.?

ప్రభాస్‌ మోసంచేశాడా? మోసపోయాడా.?

టాలీవ్డ్ హీరోల్లో ప్రభాస్ చాలా సైలెంట్ పర్సన్.. ఎలాంటి వివాదాల్లో ఉండడు అన్న మంచి పేరు ఉంది. బాహుబలి లాంటి సినిమా పడ్డాక ఎవరైనా భూమి మీద ఆగరు కాని ప్రహాస్ మాత్రం ఇదవరకు లానే ఉన్నాడు. తన యాటిట్యూడ్ లో ఏమాత్రం మార్పు రాలేదట. అయితే ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న ప్రభాస్ ప్రభుత్వ భూమిని ఎలా కొట్టేశాడు అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న. రాయదుర్గంలోని ప్రభాస్ గెస్ట్ హౌజ్ సీజ్ చేసి వెళ్లారు శేరిలింగంపల్లి రెవిన్యూ అధికారులు.

అది ప్రభుత్వ భూమని వారు చెబుతున్నారు. అయితే తన దగ్గర ఆ ల్యాండ్ తాలూఖా డాక్యుమెంట్స్ ఉన్నట్టు చెబుతున్నాడు ప్రభాస్. హైకోర్టులో పిటీషన్ వేశాడట. అయితే ప్రభాస్ కూడా ఆ ల్యాండ్ వేరే వాళ్ల దగ్గర నుండి కొన్నాడట. ఇలాంటి మోసాలు మనం రోజూ చూస్తూనే ఉంటాం. వాటికి సెలబ్రిటీస్ కూడా మినహాయింపు కాదు. ప్రభాస్ ల్యాండ్ ఇష్యూ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది టి.ఆర్.ఎస్ ప్రభుత్వ కావాలని ప్రభాస్ మీద కక్ష్య కట్టిందని వార్తలు రాస్తున్నారు.

ఏది ఏమైనా సెలబ్రిటీస్ కే ఇలాంటి మోసాలు జరుగుతుంటే ఇక సామాన్య ప్రజలు ఎలా వీటిని ఎదుర్కుంటారో అర్ధం చేసుకోవాలి. ఈ ల్యాండ్ ఇష్యూ మీద ప్రభాస్ చాలా సీరియస్ గా ఉన్నాడని తెలుస్తుంది. 2200 గజాల్లో అందమైన గెస్ట్ హౌజ్ నిర్మించుకోగా ఇలా సడెన్ గా ఆ ల్యాండ్ గవర్నమెంట్ ది అనడంతో ప్రభాస్ షాక్ అయ్యాడు. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమా చేస్తున్నాడు. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఆ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news