Movies"అలాంటి కామెంట్ ఎలా పెడతావ్ రా..?"..కీర్తి సురేష్ అభిమానులను హర్ట్ చేసిన...

“అలాంటి కామెంట్ ఎలా పెడతావ్ రా..?”..కీర్తి సురేష్ అభిమానులను హర్ట్ చేసిన వరుణ్ ధావన్..!

కీర్తి సురేష్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది . తెలుగు – తమిళం – మలయాళం సినిమాలలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కీర్తి సురేష్ తెలుగులో చివరిగా నటించిన సినిమా భోళాశంకర్ . ఆ తర్వాత అమ్మడు తెలుగు సినిమాలకు సైన్ చేయడం మానేసింది . హ్యూజ్ ట్రోలింగ్ జరగడంతో తీవ్రంగా హర్ట్ అయిన కీర్తి సురేష్ ఆ కారణంగానే తెలుగు సినిమాలకు సైన్ చేయడం లేదు అంటూ ప్రచారం జరుగుతుంది .

కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడ స్టార్ హీరో వరుణ్ ధావన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది . అంతేకాదు ఈ సినిమాలో కీర్తి సురేష్ కనివిని ఎరుగని లుక్ లో కనిపించబోతుంది అంటూ ఒక రూమర్ బాగా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో సినిమాకి కమిట్ అయిన సరే కీర్తి సురేష్ ఆ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయడం లేదు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దానికి తగ్గట్టే రీసెంట్గా వరుణ్ దావన్ – కీర్తి సురేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫొటోస్ కింద ఓపెన్ గా కామెంట్స్ చేశాడు .

“ప్లీజ్ గివ్ డేట్స్ అమ్మ” అంటూ కామెంట్ పెట్టాడు . దీంతో ఇది వైరల్ గా మారింది . అందరూ అనుకున్నట్లే కీర్తి సురేష్ డేట్స్ అడ్జస్ట్ చేసే విషయంలో బోల్తా పడింది అని ..బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందే కానీ అక్కడ టైం , కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక పోతుంది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు ఇది చాలా సరదాగా వరుణ్ దావన్ చేసిన కామెంట్ అని .. పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారు . అయితే వరుణ్ ధావన్ అంత పబ్లిక్ గా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో కామెంట్ చేయడం ఇప్పుడు సర్వత్రా విమర్శలు ఎదుర్కొనేలా చేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news