Moviesఅమ్మ బాబోయ్...ఆ కాంట్రవర్షియల్ సినిమాకి సీక్వెల్లో నటించబోతున్న సమంత... మళ్లీ పెంట...

అమ్మ బాబోయ్…ఆ కాంట్రవర్షియల్ సినిమాకి సీక్వెల్లో నటించబోతున్న సమంత… మళ్లీ పెంట పెంట చేసేస్తుందిగా..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇది ఓ ట్రెండ్గా మారిపోతుంది. గతంలో తెరకెక్కి హిట్ అయిన సినిమాలను రిలీజ్ చేయడం ఆ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కించడం చాలా చాలా కామన్ గా చూస్తున్నాం . ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికే అలా ఎన్నో సినిమాలు వచ్చాయి . వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడం లేదు. అయితే కొన్ని సినిమాలు ఫ్లాప్ కూడా అయ్యాయి. హిట్టా..? ఫట్టా..? పక్కన పెడితే అభిమానులు మాత్రం ఒకసారి తెరకెక్కించిన సినిమాను మరోసారి సీక్వెల్ పేరుతో తెరకెక్కించడం ఏంటి అని డైరెక్టర్స్ లో కొత్తదనం తగ్గిపోయింది అని ట్రోల్ చేస్తున్నారు.

కాగా రీసెంట్గా హీరోయిన్ సమంత ఒక నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. రీసెంట్ గానే సిటాడిల్ వెబ్ సిరీస్ డబ్బింగ్ పనులను ప్రారంభించిన సమంత తెలుగులో ఒక బడా ఆఫర్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . హీరోయిన్ సమంత కెరీర్నే మలుపు తిప్పిన ‘ఏం మాయ చేసావే’ సినిమాకి త్వరలోనే సీక్వెల్ రాబోతుంది అంటూ గతంలో డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రకటించారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నాగచైతన్య సమంత నటిస్తే బాగుంటుందని కోరుకున్నారు.

అయితే వాళ్ళు విడాకులు తీసుకున్న తర్వాత కలిసి నటించడానికి కాదు కదా ..కలిసి ఇంటర్వ్యూ చేయడానికి కూడా ఒప్పుకోవడం లేదు . ఇలాంటి క్రమంలోనే గౌతమ్ వాసుదేవ్ తన స్టోరీలో కూడా స్క్రిప్ట్ మార్చుకున్నారట . విడాకులు తీసుకున్న తర్వాత ఆ జంట ఎలా ఉంటున్నారు.. అసలు ఆ జంట ఎందుకు విడాకులు తీసుకున్నారు అన్న విషయాన్ని తెరపై చూపించబోతున్నారట . నిన్న మొన్నటి వరకు ఈ సినిమాలో నటించను అని చెప్పిన సమంత.. రీసెంట్గా ఈ సినిమాని ఓకే చేసినట్లు తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో మరో కాంట్రవర్షియల్ ఇష్యూలో ఇరుక్కునింది సమంత . కావాలనే సమంత ఈ సినిమాను ఓకే చేసింది అంటున్నారు అక్కినేని అభిమానులు. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news