Moviesఆ స్టార్ హీరోయిన్‌తో బాల‌కృష్ణ‌కు న్యాయం... జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు అన్యాయం..!

ఆ స్టార్ హీరోయిన్‌తో బాల‌కృష్ణ‌కు న్యాయం… జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు అన్యాయం..!

టాలీవుడ్‌లో ఈ త‌రం హీరోయిన్ల‌లో చాలా మంది స్టార్ హీరోయిన్లు ల‌క్కీ హీరోయిన్లు ఉన్నారు. అటు సీనియ‌ర్ హీరోల‌తో పాటు ఇప్ప‌టి త‌రం కుర్ర హీరోల‌కు కూడా జోడీగా న‌టిస్తున్నా లైఫ్ కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బాబాయ్ బాల‌కృష్ణ‌తో పాటు అబ్బాయ్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌తోనూ న‌టించిన హీరోయిన్లు కూడా ఉన్నారు. అలాంటి హీరోయిన్ల‌లో శృతీహాస‌న్ కూడా ఒక‌రు.

శృతీహాస‌న్ కెరిర్ స్టార్టింగ్‌లోనే 2013లో జూనియ‌ర్ ఎన్టీఆర్ ప‌క్క‌న రామ‌య్యా వ‌స్తావ‌య్యా సినిమాలో న‌టించింది. ఈ సినిమాలో ఆమె అమ్ములు పాత్ర‌లో క‌నిపించింది. ఈ సినిమా భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి నిరాశ ప‌రిచింది. ఇదే సినిమాలో స‌మంత కూడా మ‌రో హీరోయిన్‌. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు.

ఆ త‌ర్వాత ప‌దేళ్ల‌కు శృతీహాస‌న్ బాబాయ్ బాల‌య్య‌తోనూ జోడీక‌ట్టింది. గ‌తేడాది సంక్రాంతికి శృతీహాస‌న్ బాల‌య్య‌కు జోడీగా వీర‌సింహారెడ్డి సినిమాలో న‌టించింది. ఈ సినిమా సూప‌ర్ హిట్‌. బాల‌య్య కెరీర్‌లోనే ఆల్ టైం హ‌య్య‌స్ట్‌గా ఫ‌స్ట్ డే ఏకంగా రు.54 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టిందీ సినిమా. అలా సీనియ‌ర్ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ కుమార్తె శృతీ ఇద్ద‌రు నంద‌మూరి హీరోల‌తోనూ న‌టించింది.

వీరిలో బాబాయ్‌కు ఆమె న్యాయం చేస్తూ సూప‌ర్ హిట్ ఇస్తే.. అబ్బాయ్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు మాత్రం ప్లాప్ ఇచ్చింది. ఇక రామ‌య్యా వ‌స్తావ‌య్యా సినిమాలో శృతీహాస‌న్ రోల్ అనుకున్న‌ట్టుగా సెట్ కాలేద‌ని.. ప‌ల్లెటూరి యువ‌తి పాత్ర చేసిన ఆమె మోడ్ర‌న్ దుస్తుల్లో కనిపించ‌డం కొంద‌రికి న‌చ్చ‌లేద‌న్న కామెంట్లు కూడా అప్పుడు ప‌డ్డాయి. ఫ‌స్టాఫ్ బాగున్నా.. సెకండాఫ్ రొటీన్ క‌థ‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ప్లాప్ అయినా కూడా ఎన్టీఆర్ క్రేజ్‌తో ఆ రోజుల్లోనే ఏకంగా రు. 35 కోట్ల షేర్ రాబ‌ట్టింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news