News"నిద్ర లేచినప్పటి నుంచి అదే పని చేస్తే రోగం రాక..రస్నా వస్తుందా..?"..పాయల్...

“నిద్ర లేచినప్పటి నుంచి అదే పని చేస్తే రోగం రాక..రస్నా వస్తుందా..?”..పాయల్ జబ్బు పై జనాల సెటైర్లు..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మలు వరుసగా రోగాల బారిన పడిపోతున్నారు . రీజన్ ఏంటో తెలియదు కానీ పర్ఫెక్ట్ డైట్ ఫాలో అవుతూ హెల్దీ ఫుడ్ తీసుకుంటున్న సరే కొంతమంది అందాల ముద్దుగుమ్మలు రోగాల బారిన పడిపోతున్నారు . ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ అలా వింత వింత జబ్బులకి గురై బాధపడుతున్నారు . తాజాగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సైతం కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాను అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది.

ఆమె తాజాగా నటించిన సినిమా మంగళవారం . ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”తనకు కిడ్నీ సమస్యలు ఉన్నాయి అని చెప్పుకొచ్చింది. అంతేకాదు దాని కారణంగా చాలా అవస్థలు పడ్డారని కూడా చెప్పుకొచ్చింది. మీరు నాలా మాత్రం చేయకండి మంచినీళ్లు బాగా తీసుకోండి .. శరీరాన్ని డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి ” అంటూ సజెస్ట్ చేసింది.

అయితే కావాలని పాయల్ రాజ్ పుత్ అంటే పడని వాళ్ళు ఆమె వ్యాఖ్యలను వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు. పొద్దున లేచినప్పటి నుంచి వర్క్ అవుట్స్ చేస్తూనే ఉంటావు ..మరి నీళ్లు తాగకపోతే బాడీ డిహైడ్రేట్ అవ్వదా? కిడ్నీ ప్రాబ్లమ్స్ రావా..? అంటూ కౌంటర్స్ వేస్తున్నారు. అంతేకాదు సినిమాలపై పెట్టిన శ్రద్ధ ఆరోగ్యం పై పెట్టి ఉంటే నీకు ఇలాంటి వ్యాధి వచ్చేదే కాదు కదా..? అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news