News"మీడియాను పండబెట్టి తొక్కుతా"..రేవంత్ యాక్షన్ కు..అనసూయ రియాక్షన్..దొందు దొందే..!!

“మీడియాను పండబెట్టి తొక్కుతా”..రేవంత్ యాక్షన్ కు..అనసూయ రియాక్షన్..దొందు దొందే..!!

ప్రజెంట్ ఏపీ – తెలంగాణ రాజకీయాలు ఎలా వేడివేడిగా ముందుకు వెళ్తున్నాయో మనం చూస్తున్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేని సిచువేషన్ నెలకొంటున్నాయి. కాగా తాజాగా పొలిటీషియన్ రేవంత్ రెడ్డి ఓ సమావేశంలో మాట్లాడుతూ మీడియాపై ఫైర్ అయిపోయారు ..”లోఫర్ నా కొడుకులు ఛానల్స్ పెట్టేసి అడ్డగోలు చేస్తే చూస్తూ ఉంటాను అనుకుంటున్నారేమో పండబెట్టి తొక్కి పేగులు తీస్తా.. మైక్ తీసుకొచ్చి మూతి ముందు పెడితే ఎవడు కూసిన కూతలకు వివరణ ఇచ్చే ఓపిక తీరిక నాకు లేదు “అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు .

అయితే దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇష్టం వచ్చిన విధంగా రేవంత్ వాడిన పదాజలానికి మీడియా వాళ్ళు కూడా హర్ట్ అయ్యారు. అయితే దీనిపై అనసూయ భరద్వాజ్ స్పందించడం ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత హాట్ గా మారింది . రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ ..” కొన్నిసార్లు మూడు అలానే ఉంటుంది “అంటూ కామెంట్ పెట్టింది .

లాఫింగ్ ఎమోజిస్ కూడా యాడ్ చేసింది . దీనితో రేవంత్ స్పీచ్ పైన నవ్వాల్సిన అవసరం ఏముంది అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు . మరికొందరు అనసూయ మాట్లాడాల్సిన మాటలను ఆయన మాట్లాడాడు అని చెప్పకనే చెప్పేసింది అంటూ కౌంటర్స్ వేస్తున్నారు . మొత్తానికి అనసూయ తిట్టాలనుకున్నదంతా రేవంత్ రెడ్డి తిట్టేశాడు.. అందుకే ఆమె ఈ విధంగా కామెంట్ చేసింది అంటున్నారు జనాలు . దీంతో సోషల్ మీడియాలో అనసూయ పోస్ట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news