Newsవ‌రుణ్ - లావ‌ణ్య పెళ్ళి ఇట‌లీలో జ‌ర‌గ‌డం వెనుక ఎవ‌రికీ తెలియ‌ని...

వ‌రుణ్ – లావ‌ణ్య పెళ్ళి ఇట‌లీలో జ‌ర‌గ‌డం వెనుక ఎవ‌రికీ తెలియ‌ని సెంటిమెంట్ ఇదే..

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ సొట్ట బుగ్గల సుందరి హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం మూడు రోజులపాటు వీరి వివాహ వేడుక అక్కడ జరగనుంది. నవంబర్ 1న వీరి వివాహం అక్కడ గ్రాండ్గా జరగనుంది. ఈ వివాహంతో ఈ స్టార్ హీరో స్టార్ హీరోయిన్ ఇద్దరు భార్య భర్తలు కానున్నారు. ఆ తర్వాత నవంబర్ 5న హైదరాబాద్‌లో వీరి రిసెప్షన్ జరగనుంది.

ఈ రిసెప్షన్ కు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఏపీ తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ హాజరు అవుతారని తెలుస్తోంది. వాస్తవంగా వరుణ్ తేజ్ సోదరి నిహారిక పెళ్లి రాజస్థాన్‌లోని ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఇప్పుడు వరుణ్ తేజ్ పెళ్లి ప్రత్యేకంగా ఇటలీలో ఎందుకు చేస్తున్నారు ? అంటే దీని వెనక ఆసక్తికరమైన సెంటిమెంట్ కూడా ఉంది.

వరుణ్ తేజ్‌ – లావణ్య కలిసి మిస్టర్, అంతరిక్షం రెండు సినిమాలలో నటించారు. ముందుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంచనాలు అందుకోలేదు. ఆ తర్వాత అంతరిక్షం ఒక మోస్త‌రుగా ఆడింది. మిస్టర్ సినిమా షూటింగ్‌లో కొన్ని సీన్లు దర్శకుడు శ్రీనువైట్ల ఇటలీలో చిత్రీకరించారు. ఈ సినిమాలో కొన్ని పాటలు ఇటలీలో షూట్ చేశారు. ఆ టైంలోనే వరుణ్ తేజ్ లావణ్య తొలిచూపులు కలిసాయి. అలా వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.

దాదాపు ఆరేళ్ల‌పాటు వీరు ఎంతో ఇష్టంగా ప్రేమించుకున్నారు. ఇలా తమ ప్రేమ పుట్టిన‌చోటే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే వీరి వివాహం ఇటలీలో జరగనుంది. ఇప్పటికే ఈ పెళ్లి కోసం మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు అందరూ ఇటలీకి చేరుకున్నారు. సినిమాలు, రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ తన భార్య అన్నాలెజ్నోవాతో కలిసి వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇటలీ వెళ్ళిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news