Newsకొత్త చిక్కుల్లో ' గుంటూరు కారం ' .. త్రివిక్రమ్ ఆ...

కొత్త చిక్కుల్లో ‘ గుంటూరు కారం ‘ .. త్రివిక్రమ్ ఆ కథ కాపీ కొట్టాడంటూ ఆరోపణలు..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం తెలుగు భాషలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా తెలుగు మార్కెట్ ఏకంగా రూ.150 కోట్లు జరుగుతోంది. కేవలం తెలుగు భాషలో మాత్రమే చూసుకుంటే రూ.150 కోట్ల థియేటర్ బిజినెస్ అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపుగా రూ.250 కోట్ల గ్రాస్ వ‌సూళ్ళు సాధించాలి. మహేష్ బాబు – త్రివిక్రమ్ క్రేజ్ దృష్ట్యా ఇది పెద్ద కష్టం కాదు.

అయితే సినిమాకు సూపర్ హిట్ టాక్ రావాలి. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన అతడు, ఖ‌లేజా సినిమాలు వెండితెరపై అనుకున్న సక్సెస్ సాధించలేదు. అయితే బుల్లితెరపై మాత్రం ఎప్పుడూ రికార్డులు బ్రేక్ చేస్తూ ఉంటాయి. 13 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మళ్ళీ గుంటూరు కారం సినిమా తెరకెక్కుతోంది. మహేష్ కూడా గుంటూరు కారం షూటింగ్ త్వరగా పూర్తిచేసి రాజమౌళి సినిమాతో జాయిన్ కావాలని ప్లానింగ్ తో ఉన్నాడు.

ఈ సినిమా హిట్ అయితే మహేష్ బాబుతో పాటు త్రివిక్రమ్ ఇద్ద‌రికి మంచి పేరు వస్తుంది. ఎందుకో కానీ గుంటూరు కారం సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుంచి రకరకాల వివాదాల్లో చిక్కుకుంటుంది. తాజాగా ఈ సినిమా స్టోరీ నాదే అంటూ ఓ వ్యక్తి ఈ సినిమా స్టోరీ పై కేసు వేసినట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ కూడా ఈ కేసుకు సంబంధించిన పనుల్లో తిరుగుతున్నట్టు తెలుస్తోంది. సినిమా స్టోరీ ఏంటి అనేది తెలియకుండా సదర వ్యక్తి స్టోరీ నాది అని ఎలా కేసు ? వేశాడని మహేష్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

అయితే సదరు వ్యక్తి ఇంతకుముందు త్రివిక్రమ్ తో ఆ కథ చెప్పినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమా యూనిట్ మాత్రం ఎవరో కావాలనే ఇలా చేశారన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా గుంటూరు కారంకు ముందు నుంచి కూడా కాలం సరిగ్గా కలిసి రావడం లేదని చెప్పాలి. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news