Newsమ‌ద్యంతో ప‌ట్టుబ‌డిన ర‌మ్య‌కృష్ణ‌... చెన్నైలో ఏం జ‌రిగింది...!

మ‌ద్యంతో ప‌ట్టుబ‌డిన ర‌మ్య‌కృష్ణ‌… చెన్నైలో ఏం జ‌రిగింది…!

ఏపీకి చెందిన మంత్రి ప్రముఖ సినీ నటి రోజాపై టిడిపి లీడర్ బండారు సత్యనారాయణమూర్తి చేసిన విమర్శలపై ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోయిన్లు రంగంలోకి దిగి కౌంటర్లు ఇస్తున్నారు. కుష్బూ – రాధిక శరత్ కుమార్ – మరో సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా స్పందించడంతోపాటు కౌంటర్లు ఇచ్చారు. తన తోటి నటి రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలపై రమ్యకృష్ణ కూడా స్పందించారు. ఆమె ఈ వ్యాఖ్యలను ఖండించారు.

మంత్రి రోజాను బండారు అసభ్యకరంగా దూషించడం దారుణం.. మనదేశంలో మాత్రమే భారతమాతకు జై అని గర్వంగా చెబుతాం.. ఇలాంటి దేశంలో ఓ మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా అతడిని క్షమించకూడదు అని రమ్యకృష్ణ ఫైర్ అయ్యారు. దీంతో స‌హ‌జంగానే టీడీపీ సపోర్టర్లకు కోపం వచ్చింది. వాళ్ళు రమ్యకృష్ణను టార్గెట్ చేస్తున్నారు. మ‌రి వైసీపీ నాయ‌కులు, గ‌తంలో రోజా చంద్ర‌బాబు భార్య భువ‌నేశ్వ‌రిని అసెంబ్లీ సాక్షిగా టార్గెట్ చేసిన‌ప్పుడు ర‌మ్య‌కృష్ణ లాంటి వాళ్లు ఎక్క‌డ ఉన్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

అలాగే ర‌మ్య‌కృష్ణ‌కు సంబంధించిన పాత వీడియోను వైరల్ చేస్తున్నారు. గతంలో రమ్యకృష్ణ కారులో మద్యం బాటిల్స్ ఉండగా పోలీసులు పట్టుకున్నట్టు టీవీ9 లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇదే వీడియోలను టిడిపి సపోర్టర్లు వైరల్ చేస్తున్నారు. చెన్నైలో లిక్కర్ లేకపోవడంతో రమ్యకృష్ణ మహాబలిపురం నుంచి లిక్కర్ కొనుగోలు చేసి చెన్నై తెచ్చుకుంటుంది అని వీడియోను ట్రెండింగ్లోకి చేస్తున్నారు.

రమ్యకృష్ణను టార్గెట్ చేయడంతో పాటు.. రమ్యకృష్ణ గారు ఇలాంటి వారిని ఎప్పుడూ అనుకోలేదని చెబుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాను ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news