Moviesసాయి పల్లవి- సాయి ధరమ్ తేజ్ కాంబోలో మిస్ అయిన .....

సాయి పల్లవి- సాయి ధరమ్ తేజ్ కాంబోలో మిస్ అయిన .. ఆ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో సెట్ అయినట్లే సెట్ అయి మిస్ అయిపోతుంటాయి . వాటిల్లో ఒకటే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సాయి పల్లవి మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబో. రీసెంట్ గానే సాయిధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమాలో నటించి క్రేజీ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు విరూపాక్ష సినిమాతో బిగ్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. దీంతో యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్ చాలా యాక్టివ్ గా మారి హిట్లు కొడుతున్నారు అన్న కామెంట్లు వినిపించాయి.

అయితే సాయిధరమ్ తేజ్ తన ఫేవరెట్ హీరోయిన్ అయినా సాయి పల్లవి తో నటించే ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడు . లాస్ట్ మూమెంట్ వరకు ఆమె అనుకున్నా కానీ..ఈ సినిమా వేరే హీరోయిన్ చేతికి వెళ్లిపోయింది . ఆ సినిమా మరేదో కాదు విరూపాక్ష . రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి హిట్ ని అందుకున్నిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ హర్రర్ ఏప్రిల్ 21న విడుదల అవ్వగా గ్రాండ్గా సూపర్ హిట్ టాక్ ని నమోదు చేసుకుంది .

ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటన అదుర్స్ అనిపించింది . అయితే నిజానికి ఈ సినిమాలో సుకుమార్ ఫస్ట్ గా సాయి పల్లవిని చూస్ చేసుకున్నారట . సాయి పల్లవి కూడా ఓకే చేసిందట . కధా కంటెంట్ బాగుండడం.. ఎక్కడ వల్గారిటీ లేకపోవడంతో కూడా సాయి పల్లవి సినిమాలు చేయడానికి ఎస్ అన్నిందట . కానీ లాస్ట్ మూమెంట్లో ఓ పెద్దమనిషి ఎంటర్ అవ్వడంతో సాయి పల్లవి ఖాతాలో నుంచి ఈ సినిమా సంయుక్త మీనన్ ఖాతాలోకి పడిపోయింది. అయితే రేపో మాపు అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేయాల్సిన సినిమాను సాయి పల్లవికి చెప్పకుండానే వేరే హీరోయిన్ ఖాతాలోకి వేసేసారట . అయితే మొదటి నుంచి మంచితనం గల సాయి పల్లవి ఈ విషయాన్ని చాలా చాలా లైట్ గా తీసుకుంది అంటూ ప్రచారం జరిగింది. మొత్తానికి తన ఫేవరెట్ హీరోయిన్ తో చేసే ఛాన్స్ మిస్ అయిన సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు సాయిధరమ్ తేజ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news