Moviesఅమెరికాలో స‌మంత ఫుల్ ' ఖుషీ ' ఖుషీగా… ( వీడియోలు...

అమెరికాలో స‌మంత ఫుల్ ‘ ఖుషీ ‘ ఖుషీగా… ( వీడియోలు )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్గా అమెరికా వెళ్ళింది. మామూలుగా అయితే ఈ విషయాన్ని ఎవరు పెద్దగా పట్టించుకునే వారు కాదు. అయితే గత ఏడాదిన్నర కాలంగా సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యాధి చికిత్స కోసమే ఆమె అమెరికా వెళ్ళింది అంటూ రకరకాల ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రయాణం వెనక అసలు కారణం ఏంటన్నది ? ఇప్పుడు తెలిసిపోయింది.

ఫోటోలు, వీడియోలు బయటపడటంతో సమంత ఎందుకు > అమెరికా వెళ్ళింది అన్న విషయం బయటపడింది. భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా న్యూయార్క్ లో ఇండియా డే పరేడ్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఆదివారం మధ్యాహ్నం ఇవి చాలా గ్రాండ్‌గా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సమంత పాల్గొంది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.

సమంతతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాడెంజ్ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే సమంత మాట్లాడుతూ ఈరోజు న్యూయార్క్ లో ఉండటం చాలా గర్వంగా ఉంది.. భారత దేశ సంస్కృతి సంప్రదాయాలు ఎంత గొప్పగా ఉన్నాయో నేను చూసిన ఈ దృశ్యాలు మరోసారి తనకు అర్థమయ్యే లా చేశాయని తెలిపింది.

ఈ మూమెంట్స్ నా మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయని.. ఈ అరుదైన గౌరవం తనకు దక్కినందుకు తనను ఆహ్వానించిన వారికి ధన్యవాదాలు చెబుతున్నాను అని సమంత తెలిపింది. ఇక నా సినిమాలు ఆదరిస్తున్న అమెరికన్ ప్రజలకు ధన్యవాదాలు అంటూ సమంత చెప్పింది. ఈ వేడుకలలో సమంత కంటే ముందే టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ , ద‌గ్గుబాటి రాణా తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news