Moviesహీరో వెంక‌టేష్‌కు ఆ న‌లుగురు హీరోయిన్ల‌తోనూ గొడ‌వ‌లు… మాట‌లూ లేవా…!

హీరో వెంక‌టేష్‌కు ఆ న‌లుగురు హీరోయిన్ల‌తోనూ గొడ‌వ‌లు… మాట‌లూ లేవా…!

టాలీవుడ్ లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ వివాదాలకు దూరంగా ఉంటారని.. తన పని తాను చేసుకు పోతారు అన్న పేరు ఉంది. వెంకటేష్ ఇన్నేళ్ల‌ కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో నటించారు. అయితే హీరోయిన్లతో ఆయన ఎంత సఖ్యతతో ఉన్న నలుగురు హీరోయిన్ల విషయంలో మాత్రం ఆయనపై కొన్ని వివాదాలు వచ్చాయి. ఆ హీరోయిన్లతో రకరకాల విషయాలలో వెంకటేష్ కు గొడవలు వచ్చాయని.. వీరితో ఈ హీరోయిన్లలో కొందరితో ఎప్పటికీ వెంకటేష్ కు మాటలు లేవని అంటారు.

వెంకటేష్ – రోజా కాంబినేషన్లో పోకిరి రాజా సినిమా తెరకెక్కింది. ఆ తర్వాత ఒక తమిళ సినిమా రీమేక్‌ చేస్తున్నప్పుడు అక్కడ నటించిన రోజానే తెలుగులో వెంకటేష్ కు హీరోయిన్ గా తీసుకోవాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. అయితే ఆ టైంలో సౌందర్య – వెంకటేష్ జోడి మార్కెట్ బాగుంది. నిర్మాతలు రోజాకు బదులుగా చివరలో సౌందర్యను తెరమీదకు తెచ్చారు. వెంకటేష్ కావాలనే తనను తప్పించారని అపోహ పడ్డ రోజా అప్పటినుంచి ఇప్పటివరకు వెంకటేష్‌తో మాట్లాడటం లేదని.. ఆ సంఘటన వీరిద్దరి మధ్య గ్యాప్ పెంచిందన్న ప్రచారం అయితే ఉంది.

ఇక వెంకటేష్ తో మల్లీశ్వరి సినిమా టైం లో నటించిన కత్రినా కైఫ్ షూటింగ్ సగం జరిగాక తనకు ఎక్కువ రెమ్యూనరేషన్ కావాలని పట్టు పట్టడంతో వారిద్దరి మధ్య కూడా గొడవ జరిగిందంటారు. కొన్ని సన్నివేశాలు షూట్ చేస్తున్నప్పుడు కూడా వెంకటేష్ కు సరిగా కోపరేట్ చేయకపోవడంతో ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగిందన్న ప్రచారం ఉంది. చివరకు కత్రినా అడిగినంత‌ రెమ్యూనరేషన్ ఇస్తే కానీ ఈ గొడవ పరిష్కారం కాలేదని అంటారు. ఇక మరో హీరోయిన్ నిత్యామీనన్ ఒక సినిమాలో వెంకటేష్ పక్కన హీరోయిన్గా చేయాలన్న ఆఫర్ వెళ్ళినప్పుడు అంకుల్ పక్కన నేను హీరోయిన్ గా నటించడం ఏంటనడంతో వెంకటేష్ బాగా ఫీలయ్యారన్న ప్రచారం ఇండస్ట్రీలో జరిగింది.

ఇక మరో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ – వెంకటేష్ కాంబినేషన్లో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. ఒక షూటింగ్ టైంలో వీరిద్దరి మధ్య స్వల్ప వివాదం జరిగిందని.. అయితే ఆ తర్వాత వీరిద్దరూ అవన్నీ మర్చిపోయి ఇప్పటికే మంచి స్నేహితులుగానే ఉంటారన్న టాక్ అయితే ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news