Moviesపాపం..హైపర్‌ ఆది చేసిన పనికి స్టేజీ పైనే కన్నీళ్ళు పెట్టుకున్న యాంకర్‌...

పాపం..హైపర్‌ ఆది చేసిన పనికి స్టేజీ పైనే కన్నీళ్ళు పెట్టుకున్న యాంకర్‌ సౌమ్యరావు(వీడియో)..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈ కమెడియన్ రాత్రికి రాత్రి సూపర్ స్టార్ గా మారిపోయాడు . అంతేకాదు ఓవైపు రాజకీయాలలో మరోవైపు బుల్లితెర పై.. మరోవైపు సినిమాలలో తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు . కాగ హైపర్ ఆది ఎప్పుడు వల్గర్ డైలాగ్స్ ..పవర్ఫుల్ పంచెస్ వేస్తాడని.. వేసి అభిమానులను నవ్వించి అట్రాక్ట్ చేస్తాడని చెప్పుకుంటూ ఉంటారు జనాలు.

అయితే ఫస్ట్ టైం హైపర్ ఆది ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. జబర్దస్త్ యాంకర్ సౌమ్యరావు ని స్టేజిపైనే ఏడిపించేసాడు. శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపర్ ఆది సౌమ్యరావుకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు . ఫస్ట్ ప్యాకింగ్ చూసిన సౌమ్య చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయింది . ఆ తర్వాత ఈ గిఫ్ట్ లో ఏముంది అని అడగ్గా..? నీకు చాలా నచ్చుతుంది అంటూ హైపర్ ఆది బదులిస్తాడు.

దీంతో సౌమ్యారావ్ ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూడగా అది వాళ్ళ అమ్మ గారి ఫోటో అని తెలుసుకుని చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. స్టేజ్ పైన ఏడ్చేస్తుంది. దీంతో ఈ విజువల్స్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హైపర్ ఆదికి అమ్మాయిలని ఇలా కూడా ఏడిపించడం తెలుసా? ఎప్పుడు వల్గర్ డైలాగ్స్ వేసే హైపర్ ఆది.. ఇంత ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయా..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు . ప్రెసెంట్ ఈ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో శ్రీదేవి డ్రామా కంపెనీ వీడియో ప్రోమో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news