Moviesఆ సినిమాలో నటించిన ..స్టార్స్ అందరు చనిపోయారు అన్న సంగతి మీకు...

ఆ సినిమాలో నటించిన ..స్టార్స్ అందరు చనిపోయారు అన్న సంగతి మీకు తెలుసా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా లోకం . ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు . ఎవరు గెస్ చేయలేరు అలాంటి గెస్ చేయలేని మూమెంట్ కి ఎంతోమంది స్టార్ సెలబ్రెటీస్ మరణించారు . అయితే అనూహ్యంగా ఓ సినిమాలో నటించిన స్టార్స్ అంత మరణించడం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే 2001లో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా ఏది అంటే అందరూ కళ్ళు మూసుకుని చెప్పే పేరు “నువ్వు నేను”.

మల్టీ టాలెంటెడ్ దర్శకుడు తేజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా ఉదయ్ కిరణ్ ..హీరోయిన్ గా అనిత నటించారు . ప్రధాన పాత్రలో ధర్మవరపు ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. ఎం ఎస్ నారాయణ ..ఆహుతి ప్రసాద్ నటించిన ఈ సినిమా ఇప్పటికీ టాప్ మోస్ట్ స్థానాన్ని అభిమానుల మనసులో చోటు దక్కించుకోవడానికి కారణం ఉదయ్ కిరణ్ నటననే అని చెప్పాలి . అయితే ఏం పాపం చేశాడో తెలియదు కానీ చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు ఉదయ్ కిరణ్.

కేవలం ఉదయ్ కిరణ్ నే కాదు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం . ఎంఎస్ నారాయణ .. ఆహుతి ప్రసాద్ కూడా అనూహ్యంగా మరణించారు . దీంతో ఈ వార్తను మరింత స్థాయిలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఒక్క సినిమాలో నటించిన ఈ స్టార్స్ అందరు చనిపోవడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి. ఈ సినిమా విజయానికి వీళ్లు ఎంతో ప్లస్ అయ్యారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news