Movies' విరూపాక్ష ' హిట్ టాక్ వెన‌క బాల‌య్య‌, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌......

‘ విరూపాక్ష ‘ హిట్ టాక్ వెన‌క బాల‌య్య‌, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌… మెగా ఫ్యాన్స్‌ను మించిన ర‌చ్చ‌..!

టాలీవుడ్ లో మెగా, నందమూరి కుటుంబాల మధ్య వృత్తిపరంగా కొన్ని దశాబ్దాల వైరుధ్యం ఉంది. గతంలో అల్లు రామలింగయ్య – ఎన్టీఆర్ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ, అల్లు రామలింగయ్య అల్లుడు చిరంజీవి మధ్య దశాబ్దాల పాటు వైరం కొనసాగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ – చరణ్ కలిసి త్రిబుల్ ఆర్ సినిమాలో నటించి ఈ రెండు కుటుంబాల అభిమానుల మధ్య యుద్ధాన్ని కొంతవరకు తగ్గించే ప్రయత్నం చేసినా… అవి ఇంకాస్త పెరుగుతున్నాయి.

ప్రతిరోజు త్రిబుల్ ఆర్ సినిమా విషయంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో యుద్ధాలు జరుగుతూ ఉంటున్నాయి. అయితే ఇలాంటి వాటికి భిన్నంగా ఉండే మెగా హీరో సాయిధరమ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు అయిన సాయి ధరంతేజ్ కు నందమూరి హీరోలతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ తో ఎప్పటినుంచో సాయి తేజ్ కు మంచి స్నేహం ఉంది. ఎన్టీఆర్ తో ఇంకా క్లోజ్ రిలేషన్ మైంటైన్ చేస్తాడు.

నందమూరి హీరోల సినిమాలు ఎప్పుడు ? రిలీజ్ అయిన సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో తన వంతుగా ప్రమోషన్ చేస్తూనే ఉంటాడు. అన్నిటికీ మించి తన మేనమామ చిరంజీవి అయినా కూడా బాలయ్యపై ఎప్పటికప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటాడు. ఇక సాయిధరమ్ తేజ్ సినిమాల్లోకి రాక ముందు నుంచే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో స్నేహంగా ఉండేవాడు. తన సినిమాల‌ ఓపెనింగ్స్ కి ప్రమోషన్లకు కూడా నందమూరి హీరోలను ఆహ్వానించడం సాయి తేజ్ కి ముందు నుంచి ఉన్న అలవాటు.

అందుకే నందమూరి అభిమానులు కూడా సాయిధరమ్ తేజ్‌ను మిగిలిన మెగా హీరోల్లా కాకుండా కొంచెం స్పెషల్ గా ట్రీట్ చేస్తూ ఉంటారు. సాయి ధరమ్ తేజ్ సినిమా వస్తుంది అంటే చాలు.. తమ వంతుగా సపోర్ట్ చేస్తారు. బాలయ్య అభిమానులు కూడా సాయి తేజ్‌ను ఎంతో అభిమానిస్తారు. తాజాగా యాక్సిడెంట్ నుంచి కోలుకున్నాక సాయిధరమ్ తేజ్‌ నటించిన విరూపాక్ష సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో విరూపాక్ష సినిమాకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరింత అండగా నిలుస్తున్నారు.

ఈ సినిమాకు ఇప్పటికే సూపర్ హిట్ టాక్ రావడంతో సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ వాయిస్ వినడానికి ఎన్టీఆర్ అభిమానులు కూడా సినిమా చూస్తామని చెబుతున్నారు. అటు బాలయ్య అభిమానులు సైతం విరూపాక్షకు మంచి టాక్ వచ్చిందని.. సాయి తేజ్‌ యాక్సిడెంట్ నుంచి కోలుకుని బ్యాక్ బౌన్స్ అయ్యాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఇద్దరు నందమూరి హీరోల అభిమానుల బ్యాకప్ విరూపాక్షకు దొరికేసింది. మార్నింగ్ షోస్ తో హిట్ టాక్‌ రావడంతో విరూపాక్షకు ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌ను మించిన ర‌చ్చ నంద‌మూరి ఫ్యాన్స్ నుంచి మొద‌లైంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news