Moviesగోపీచంద్ మలినేని నెక్ట్స్ చిత్రం ఎవరితో తెలిస్తే..మైండ్ బ్లాక్ అయిపోద్ది..జాక్ పాట్...

గోపీచంద్ మలినేని నెక్ట్స్ చిత్రం ఎవరితో తెలిస్తే..మైండ్ బ్లాక్ అయిపోద్ది..జాక్ పాట్ కొట్టాడురోయ్..!!

మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ మలినేని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ.. మంచి డైరెక్టర్గా గుర్తింపు సంపాదించుకున్న ఈయన ..క్రాక్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . తర్వాత బాలయ్య కాంబోలో సినిమాను ఫిక్స్ చేసుకున్న గోపీచంద్ మలినేని ..రీసెంట్గా వీరసింహారెడ్డి అనే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

నందమూరి నట సిం హం బాలయ్య హీరోగా ..అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా జనవరి 12వ తేదీన గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి .. సూపర్ డూపర్ హిట్ టాక్ సంపాదించుకున్నింది. అంతేకాదు మొదటి రోజే ఏకంగా 54 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డును తిరగా రాసింది. కాగా ఇంత పెద్ద సక్సెస్ అందుకున్న తర్వాత గోపీచంద్ నెక్స్ట్ సినిమాని ఏ హీరోతో చేయబోతున్నాడు అని సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది .

కాగా రీసెంట్గా సినిమా ఈవెంట్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ గోపీచంద్ మలినేని ..”పవన్ కళ్యాణ్ కోసం ఒక కథ సిద్ధం చేసుకున్నాను అని ..ఆయన అవకాశం ఇస్తే ఖచ్చితంగా సినిమాను తెరకెక్కిస్తానని ..పవన్ ఫ్యాన్స్ కు బాగా నచ్చుతుందని ..నేను నందమూరి బాలయ్యకు పవన్ కళ్యాణ్ కు బిగ్గెస్ట్ ఫ్యాన్స్ అని చెప్పుకొచ్చాడు . ఈ క్రమంలోనేపవన్ తో గోపీచంద్ జత కడితే మాత్రం హ్యాట్రిక్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నట్టే అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . చూడాలి మరి వీళ్లిద్దరి కాంబో ఎప్పుడు ఫిక్స్ అవుతుందో.. తెర పై ఎప్పుడు సందడి చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news