Moviesబిగ్ బ్రేకింగ్: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పుష్ప 2 లీక్డ్...

బిగ్ బ్రేకింగ్: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పుష్ప 2 లీక్డ్ డైలాగ్.. బన్నీ ఇరగదీశాడు..!!

గత ఏడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన చిత్రం పుష్ప . డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఫస్ట్ టైం డి గ్లామరస్ లుక్ లో నటించి మెప్పించాడు . అంతేకాదు నేషనల్ క్రష్ రష్మిక సైతం ఈ సినిమాలో డి గ్లామరస్ లుక్ లో కనిపించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత రష్మిక కెరియర్ ఏ రేంజ్ లో మారిపోయిందో అందరికీ తెలిసిందే. పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ సైతం స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు .

కాగా అన్ని అనుకున్నట్లు జరుగుంటే మరికొన్ని రోజుల్లో పుష్ప2 గ్రాండ్గా రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది . అయితే షూటింగ్ ఆలస్యమైన కారణంగా సినిమా మరింత లేటుగా రిలీజ్ అవుతుంది . ప్రెసెంట్ షూటింగ్ దశలో ఉన్న పుష్ప2కి సంబంధించి క్రేజీ అప్డేట్స్ ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులకి కొత్త బూస్టప్ ఇస్తుంది. ఈ క్రమంలోనే పుష్ప2 నుంచి క్రేజీ డైలాగ్ లీకై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

“అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేస్తే పులి వచ్చిందని అర్థం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేస్తే..పుష్ప.. పుష్ప రాజ్ వచ్చాడని అర్థం..నీ యవ్వ తగ్గేదేలే .. “అని లెంతీ డైలాగ్ లీక్ అయినట్లుగా తెలుస్తుంది . అలాగే “వాళ్ళు గొర్రెలను కాయడానికి వచ్చారు.. ఆ గొర్రెలను తినడానికి నేను వచ్చాను “అంటూ పుష్పరాజ్ బేస్ వాయిస్ తో చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి డైలాగ్స్ చాలనే లీకైనట్టుగా సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది . అంతే కాదు డిసెంబర్ 16న పుష్ప2 గ్లింప్స్ విడుదల చేసేందుకు మేకర్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news