Moviesజనాలను పిచ్చోళ్లని చేసిన శేఖర్ కమ్ముల..అంత ఎర్రి ముఖాలులా కనిపిస్తున్నామా..?

జనాలను పిచ్చోళ్లని చేసిన శేఖర్ కమ్ముల..అంత ఎర్రి ముఖాలులా కనిపిస్తున్నామా..?

సాధారణంగా లైఫ్ లో అందరూ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు . తెలిసి కొందరు మిస్టేక్స్ చేస్తుంటే ..తెలియక కొందరు చేస్తూ ఉంటారు . అయితే తెలియక చేసిన మిస్టేక్ ను తెలుసుకుని తప్పు సరిదిద్దుకున్న వాడే నిజమైన మనిషిగా జీవితంలో ముందుకెళ్తాడు. అయితే సినీ ఇండస్ట్రీలో ఒకసారి తప్పు చేస్తే ఆ తప్పుడు సరిదిద్దుకోలేరు . అలాంటి తప్పే చేసి నెటిజన్స్ కు అడ్డంగా బుక్ అయ్యాడు ఫ్యామిలీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల . మనకు తెలిసిందే శేఖర్ కమ్ముల డైరెక్షన్లో మంచి మంచి సినిమాలు పడ్డాయి.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ , హ్యాపీడేస్, ఫిదా, ఆనంద్, గోదావరి,, ఇలా ఇండస్ట్రీ చరిత్ర తిరగరాసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో శేఖర్ కమ్ములను ట్రోల్ చేస్తున్నారు జనాలు . దానికి కారణం ఆయన డైరెక్ట్ చేసిన ఫిదా సినిమాలో చిన్న లాజిక్ ను మిస్ అవ్వడమే . ఇంత పెద్ద స్టార్ డైరెక్టర్ కి ఆ చిన్న లాజిక్ తెలియదా అంటూ జనాలు మండిపడుతున్నారు . మనకు తెలిసిందే ఫిదా సినిమాలో హీరో వరుణ్ తేజ్ అమెరికాలో ఉంటాడు ..అన్న పెళ్లి కోసం ఇండియా వస్తాడు .

హీరోయిన్ సాయి పల్లవి ఇండియాలోని చదువుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే వాళ్ళు మధ్య ఏర్పడిన ప్రేమ కొన్ని కారణాల వల్ల దూరమవుతారు . ఈ క్రమంలో అమెరికాలో ఉన్న సాయి పల్లవి అక్క..తో ఇండియాలో ఉన్న సాయి పల్లవి మాట్లాడుతూ ఉంటుంది . అయితే ఇక్కడే లాజిక్ మిస్ అయింది. ఏంటంటే ..ఇండియాలో డే అయితే అమెరికాలో నైట్ ..మరి సాయి పల్లవి వాళ్ళ అక్క తో మాట్లాడుతున్నప్పుడు డే లైటింగ్ ని చూపించాడు శేఖర్ కమ్ముల. ఇదే పాయింట్ ని క్యాచ్ చేసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో ఆయనని ట్రోల్ చేసేస్తున్నారు. ఇంత పెద్ద డైరెక్టర్ కి ఆ మాత్రం తెలియదా అంటూ మండిపడుతున్నారు . ఏది ఏమైనా సరే తెలుసో తెలియకో చేసిన ఈ చిన్న తప్పుని రిలీజ్ అయిన ఇన్నేళ తర్వాత పాయింట్ అవుట్ చేయడం కొంచెం టూమచ్ గా ఉంది అంటున్నారు కొందరుజనాలు. చూడాలి మరి శేఖర్ కమ్ముల ఈ తప్పుని ఎలా సరిదిద్దుకుంటాడో.. ఎలాంటి ఆన్సర్ ఇస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news