Moviesit's Official: పెళ్ళైన నాలుగు నెలలకే తల్లైన నయనతార..ఆడు మగాడ్రా బుజ్జి..!!

it’s Official: పెళ్ళైన నాలుగు నెలలకే తల్లైన నయనతార..ఆడు మగాడ్రా బుజ్జి..!!

కొద్దిసేపటి క్రితమే అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించారు నయన్ విగ్నేష్ జంట . పెళ్లైన నాలుగు నెలలకే తల్లిదండ్రులై సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు ఈ కోలీవుడ్ స్టార్ కపుల్స్. ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . అంతేకాదు సినీ సెలబ్రిటీస్ సైతం ఆశ్చర్యపోతున్నారు. మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఉన్న నయనతార జూన్ 9న విగ్నేష్ శివను పెళ్లి చేసుకుంది.

 

తమిళనాడులోని మహాబలిపురంలో ఓ రిసార్ట్లో గ్రాండ్ గా వెడ్డింగ్ జరుపుకున్న ఈ జంట ఇప్పటికే రెండు హనీమూన్లు కంప్లీట్ చేసుకున్నారు. అయితే త్వరలోనే మూడో హనీమూన్ అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే విగ్నేష్ శివన్ తన అఫీషియల్ ఇంస్టాగ్రామ్ పేజీలో వాళ్లి తల్లిదండ్రులయ్యారు అనే విషయం చెప్పుకొచ్చారు. మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు విగ్నేష్. దీంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. మరి కొంతమంది కంగ్రాట్స్ అంటూ విష్ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ జనాలకు ఈ విషయం షాకింగ్ గానే ఉంది. పెళ్లైన నాలుగు నెలలకు ఎలా తల్లిదండ్రులయ్యారు అర్థం కావడం లేదు.

కాగా విగ్నేష్ శివన్ తన అఫీషియల్ ఇంస్టాగ్రామ్ పేజీలో..” నేను నయనతార తల్లిదండ్రుల, అయ్యాం. మాకు ఇద్దరు త్విన్స్ కొడుకులు పుట్టారు. ఈ క్షణాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము .మాతో పాటు మా బిడ్డలని మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం..” అంటూ వాళ్ళ కాళ్ళను ముద్దాడుతున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఊహించని పరిణామంతో నయన్ అభిమానులు నవ్వాలో ఏడవాలో తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కొందరు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేసుంటే ..మరి కొందరు హౌ ఇట్స్ పాసిబుల్ అంటూ మాట్లాడుకుంటున్నారు .మొత్తానికి ఆడు మగాడ్రా బుజ్జి అనే టైటిల్ని విగ్నేశ్ శివన్ కి ట్యాగ్ చేస్తూ కొందరు ట్రోల్ చేస్తున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news