Moviesనిజంగానే స్టార్ కమెడియన్‌ని సౌందర్య కొడతానని చెప్పిందా..?

నిజంగానే స్టార్ కమెడియన్‌ని సౌందర్య కొడతానని చెప్పిందా..?

సినిమా ఇండస్ట్రీలో మహానటి సావిత్రి తర్వాత మళ్ళీ దాదాపు అంత క్రేజ్ తెచ్చుకున్న దివంగత సౌందర్య. కెరీర్ ప్రారంభంలో..చివరిలో అందాలు ఆరబోసినా కూడా అది చాలా తక్కువ శాతమే. తొంబై శాతం పద్దతైన పాత్రలనే చేసింది. ఫ్యామిలీ హీరోయిన్‌గా సౌత్ సినిమా ఇండస్ట్రీలలో మాత్రేమే కాకుండా బాలీవుడ్‌లో కూడా పేరు తెచ్చుకుంది. తమిళ, కన్నడ, మలాయళ స్టార్ హీరోలరో పాటు దాదాపు అందరు టాలీవుడ్ హీరోల సరసన నటించింది సౌందర్య.

తన కెరీర్‌లో ఎక్కువగా చేసిన సినిమాలు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలే. చిరంజీవి, వెంకటేష్‌లకి హిట్ పేయిర్ అనే పేరుంది. మరీ ముఖ్యంగా వెంకటేష్, సౌందర్యలది అద్భుతమైన కాంబినేషన్. నాగార్జున, సౌందర్యలది అలాంటి హిట్ కాంబినేషనే. హీరోలకే కాదు దర్శక, నిర్మాతలకీ సౌందర్య లక్కీ హీరోయిన్. ఏ మేకర్స్‌తో సినిమా చేసినా వారికి హిట్ దక్కింది. అందుకే, భాష ఏదైనా సౌందర్య డేట్స్ కోసం అందరూ క్యూ కట్టారు.

ఇక సౌందర్య కొన్ని ప్రత్యేక గీతాలలోనూ నటించింది. ఇది పెద్ద వింతేమీ కాదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్స్‌గా వెలుగుతున్న పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, సమంత లాంటి వారు భారీ రెమ్యునరేషన్ తీసుకొని ఐటెం సాంగ్స్ చేస్తున్నారు. వారికి మంచి క్రేజ్ కూడా వస్తోంది. అయితే, ఇప్పుడు వీరు ఐటెం సాంగ్స్ చేయడానికి సౌందర్య లాంటి స్టార్ హీరోయిన్సే ఇన్సిపిరేషన్ అని చెప్పాలి. మాయలోడు సినిమాలో బాబు మోహన్‌తో కలిసి చినుకు చినుకు అందెలతో అంటూ అద్బుతమైన వాన పాటలో మాస్ స్టెప్స్ వేసి ఆకట్టుకుంది.

అయితే, అప్పటికే సౌందర్య చాలా బిజీ హీరోయిన్. అదీ గాక స్టార్ హీరోతో ఐటెం సాంగ్ అంటే ఓ క్రేజ్. కానీ, బాబూ మోహన్ లాంటి కమెడియన్‌తో అంటే ఏ హీరోయిన్ ఒప్పుకోదు. ఎస్వీ క్రిష్ణారెడ్డి కోసం ఈ సాంగ్ చేయడానికి ఒప్పుకుందట. కానీ, సాంగ్‌లో నన్ను గనక బాబు మోహన్ తాకితే కొట్టేస్తానంటూ సరదాగా చెప్పిందట. నిజంగా ఈ సాంగ్‌లో ఎక్కడా సౌందర్య, బాబు మోహన్‌ల మధ్య టచింగ్స్ ఉండవు. ఆ విషయం పాట చూసిన అందరికీ తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news