Moviesముగ్గురు మరణాలకు అదే లింక్.. ఘట్టమనేని అభిమానులను భయపెడుతున్న సెంటిమెంట్..!?

ముగ్గురు మరణాలకు అదే లింక్.. ఘట్టమనేని అభిమానులను భయపెడుతున్న సెంటిమెంట్..!?

గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి . ఒక సెలబ్రిటీ మరణ తాలూకా వార్త విని ఆ విషాద ఛాయలు మరవకముందే ..మరో సెలబ్రిటీ మరణిస్తూ ఉండడం సినీ ఇండస్ట్రీను తీవ్రశోకసంద్రంలో ముంచేస్తుంది. టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు మరణించి ఆ విషాదఛాయలు మరవకముందే టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో కృష్ణ మొదటి భార్య ఇందిరా మరణించిన వార్త ఇప్పుడు సినీ ఇండస్ట్రీని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.


మనకు తెలిసింది టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో కృష్ణకు ఇద్దరు భార్యలు. మొదట ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్న ఆయన ఆ తర్వాత విజయనిర్మలను కూడా పెళ్లి చేసుకున్నారు. కాగా కృష్ణ రెండవ భార్య విజయనిర్మల 2019 జూన్ 27వ తారీఖున మరణించింది. కాగా రీసెంట్ గా కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి అనారోగ్య కారణంగా మరణించింది . ఈ ఇద్దరి మరణాలతో సూపర్ స్టార్ కృష్ణ మరింత కృంగిపోతున్నాడు అని తెలుస్తుంది. అయితే ఘట్టమనేని అభిమానులను ఓ సెంటిమెంట్ భయపడుతుంది . గత మూడు సంవత్సరాల వ్యాధిలో ఈ ఫ్యామిలీ నుంచి ముగ్గురు స్టార్ సెలబ్రిటీస్ మరణించారు.

మొదటగా కృష్ణ రెండవ భార్య విజయనిర్మల 2019 జూన్ 27న హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. అయితే ఆమెకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఆమె నిలదొక్కుకున్నారు. కానీ అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా హార్ట్ ఎటాక్ రావడంతో ఆమె స్పాట్ లోనే చనిపోయారు. ఈ సంఘటనతో కృష్ణ కుటుంబం షాక్ అయింది. కాగా ఆ తరువాత ఈ ఏడాది ప్రారంభంలోనే మహేష్ అన్నయ్య రమేష్ బాబు అనారోగ్య కారణంగా మృతి చెందారు. కొన్నాళ్లుగా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న రమేష్ బాబు చికిత్స తీసుకుంటున్న కానీ ఫలితం దక్కలేకపోయింది. అయితే అనారోగ్య కారణంగా ఆయన బాధపడుతున్న కానీ యాక్టివ్గానే ఉన్నాడని ప్రాణాలకు ప్రమాదం ఏమీ లేదని అప్పట్లో డాక్టర్ చెప్పినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. రమేష్ బాబు మరణించడం కృష్ణ మహేష్ లను కృంగదీసింది.

చిన్న వయసులోనే రమేష్ బాబు ప్రాణాలను వదిలేయడం సినీ ఇండస్ట్రీకి కోల్కోలేని షాక్ ఇచ్చింది. కాగా ఇప్పుడు అదే రీజన్ తో అదే సమస్యతో మహేష్ బాబు తల్లి ఇందిరా మరణించడం ఘట్టమనేని అభిమానులను షాక్ కి గురి చేసింది . ఎలాగైతే విజయనిర్మల అనారోగ్య కారణంగా బాధపడిందో.. రమేష్ బాబు అనారోగ్య కారణంగా బాధపడుతూ వచ్చారో.. అలాగే మహేష్ బాబు అమ్మగారు ఇందిరా కూడా గత కొంతకాలం నుంచి అనారోగ్య కారణంగా బాధపడుతూ వచ్చారు. అయితే ప్రాణాలు పోయేంత ఆరోగ్యం ఆమెకి క్షీణించలేదు . యాక్టివ్ గానే ఉండింది కానీ ఎవరు ఊహించిన విధంగా ఆమె మరణం వార్త వినడం అభిమానులకు షాకింగ్ అనిపిస్తుంది. ఇక ఇదే క్రమంలో సూపర్ స్టార్ కృష్ణ హెల్త్ గురించి సంబంధించిన వైరల్ గా మారింది . ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే . దీంతో ఇప్పుడు ఘట్టమనేని అభిమానులకు సూపర్ స్టార్ హెల్త్ విషయంలో బాధపడుతున్నారు. కాగా నేడు మహాప్రస్థానంలో ఇందిరా దేవి అంతక్రియలు జరగనున్నాయి. తల్లి ఇందిరా దేవి మరణం మహేష్ బాబును విషాదంలో ముంచేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news