Moviesసినిమా ప్రమోషన్స్ కోసం ఏమైన చేస్తారా..ఈ సెలబ్రిటీలు..?

సినిమా ప్రమోషన్స్ కోసం ఏమైన చేస్తారా..ఈ సెలబ్రిటీలు..?

ఈరోజుల్లో ఒక సినిమా ఎలా తెరకెక్కించామా అన్నది కాదు..ఆ సినిమాని ఎలా ప్రమోట్ చేసామా అన్నదే పాయింట్. ప్రస్తుతం ట్రెండ్ అలాగే ఉంది. ఒకప్పుడు సినిమాలు ..కథ బాగుందా ..?హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగుందా..? జనాలను ఆకట్టుకుందా..? ఇలాంటివి చూసేవాళ్ళు. కానీ, ప్రస్తుత కాలంలో అవన్నీ చూడట్లేదు. సినిమా ఎంత దరిద్రంగా తీసిన దానికి డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తే ఖచ్చితంగా సినిమా జనాలకు ఎక్కుతుంది. ఈ విషయంలో తప్పు సినీ సెలబ్రిటీల ది అన్నాలో.. ఎంత దరిద్రంగా తీసిన ఆ సినిమా చూస్తున్న జనాలని అన్నాలో తెలియడం లేదు.

ఓ సినిమాని ప్రమోట్ చేయడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా. అది ఇప్పటికే ఆయన తన సినిమాల విషయంలో ఎన్నోసార్లు ప్రూవ్ చేశారు. ఆయన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ నుండి నిన్న కాక మొన్న వచ్చిన బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ వరకు ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి ఎంత కష్టపడతారో తెలిసిందే. రాజమౌళి ది ఓ డిఫరెంట్ స్టైల్.. సినిమాలు తీయడానికి కష్టపడతాడు.. ఆ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి కష్టపడతారు. కానీ కొందరు డైరెక్టర్స్ మాత్రం రాజమౌళి అంతా ముందు చూపుతో ఉండరు కదా. సినిమాను ఏదోలా తీసేస్తారు. కానీ దాని ప్రమోషన్స్ మాత్రం పక్కాగా ఉండాలని అనుకుంటారు. ప్రస్తుతం అదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ గా మారింది. అది నాగార్జున, రాజమౌళి, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కలిసి భోజనం చేస్తున్న ఫోటో. ఈ ఫోటోని ఎంతలా వైరల్ చేస్తున్నారంటే ..పుట్టినప్పటినుంచి వాళ్లు ఇదే ఫస్ట్ టైం భోఝనం చేస్తున్నట్లుగా ..వీళ్ళు కాకపోతే ఇంకెవరు ప్రపంచంలో ఫుడ్ తినలేదా అరిట ఆకుల్లో..? అన్న రేంజ్ లో వైరల్ చేస్తున్నారు జనాలు.బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ లో రాజమౌళి కీలకపాత్ర పోషిస్తున్నారు . ఆయన ఈ సినిమాకి సమర్పికుడుగా వ్యవహరిస్తున్నాడు. రణబీర్ కపూర్ మెయిన్ హీరోగా ఆయన భార్య అలియా భట్ హీరోయిన్ గా.. ముఖ్యపాత్రలో నాగార్జున నటిస్తున్న సినిమానే ఈ బ్రహ్మాస్త్ర.

నిజానికి ఈ సినిమాకి 500 కోట్లు భారీ బడ్జెట్ పెట్టారు . సినిమా కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్ తో మన ముందుకు రాబోతుంది అంటూ ప్రచారం చేశారు. ఇప్పటికీ ఈ సినిమాపై బోలెడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోనున్నారు. కానీ రాజమౌళి తన వంతు సహాయంగా సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోని వాళ్లు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో సందడి చేశారు . యూనిట్ అంతా కలిసి హోటల్లో కూర్చొని విందు చేశారు . వాళ్లల్లో నాగార్జున- రాజమౌళి -రణబీర్ కపూర్ కూడా ఉన్నారు .ఈ ముగ్గురు హోటల్లో అరిటాకులో అన్నం తినడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఫొటోస్ పై కొందరు పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు . “ఇంత పెద్ద స్టార్స్ సాదాసీదాగా ఓ నార్మల్ హోటల్లో తినడం ఏంటి” అంటూ ఆశ్చర్యపోతుంటే.. మరికొందరు “ఇది పబ్లిసిటీ స్టంట్ ..ప్రమోషన్స్ కోసమే ఇలా చేస్తారు.. నార్మల్ రోజుల్లో ఇలా తినమనండి తినరు..జనాలను దగ్గర కూడా రానివ్వరు .. ఇప్పుడు సినిమా కోసమే ఇదంతా చేస్తున్నారు.. ఈ సినిమా వాళ్ళు ప్రమోషన్స్ కోసం ఏమైనా చేస్తారు” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news