Moviesఅన్న‌ద‌మ్ముల అనుబంధంలో తాత ఎన్టీఆర్‌ను మించిన తార‌క్‌... ఎంత గొప్ప మ‌న‌సంటే..!

అన్న‌ద‌మ్ముల అనుబంధంలో తాత ఎన్టీఆర్‌ను మించిన తార‌క్‌… ఎంత గొప్ప మ‌న‌సంటే..!

సహజంగానే అన్నదమ్ముల అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటే ఆ అనుబంధం ఎంతో గొప్పగా ఉంటుంది. అయితే చాలామంది అన్నదమ్ములు ప్రాణాలు ఇచ్చిపుచ్చుకునేంత అభిమానంతో ఉన్నా ఆర్థికపరమైన సంబంధాల విషయంలో మాత్రం ఎక్కువగా సాయం చేసుకున్నట్టు కనపడరు. ఈ ఆర్థికపరమైన అనుబంధాలు చాలా తక్కువ మంది సోదరుల మధ్య మాత్రమే ఉంటాయి. నందమూరి వంశంలో ఎన్టీఆర్ తన సోదరుడు త్రివిక్రమరావు కోసం ఆర్థికంగా కూడా ఎంతో సాయం చేశారంట. చిన్నప్పుడు త్రివిక్రమరావు తాను వ్యాపారంలో నిమగ్న‌మయ్య అన్న ఎన్టీఆర్ తెలివిగా ఉంటారు… ఆయన చదువుకుంటే బాగుంటుందని చెప్పారట.

ఎన్టీఆర్ సినిమా రంగంలో వెలుగులోకి వచ్చాక తన సోదరుడిని కూడా సినిమా రంగంలోకి తీసుకువచ్చి నిర్మాతను చేశారు. అప్పట్లోనే ఆరు సినిమాలు త్రివిక్రమరావు పేరిట ఎన్టీఆర్ రాసేశారు. అలాగే మద్రాస్ లో 40 ఎకరాల ద్రాక్ష తోటను త్రివిక్రమరావు పేరిట రాయడంతో పాటు మద్రాసులో వాళ్ళ కుటుంబం ఉన్న ఉమ్మడి ఇల్లును కూడా ఆయనకే ఇచ్చేసారట. అంత అనుబంధం ఎన్టీఆర్ – త్రివిక్ర‌మరావు మధ్య ఉండేదట. ఆ తర్వాత నందమూరి వంశంలో హరికృష్ణ, బాలకృష్ణ మధ్య కూడా కొద్ది రోజులు అదే అనుబంధం నడిచినా ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ‌రావు అంత అనుబంధం వీరి మధ్య ఉన్నట్టు అనిపించదు.

అయితే ఇప్పుడు మూడో తరంలో హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌ మధ్య కూడా తమ తాత‌లు ఎన్టీఆర్ – త్రివిక్రమరావు మధ్య ఎలాంటి అనుబంధం ఉందో అంతే గొప్ప అనుబంధం కొనసాగుతోంది. జానకిరామ్ మరణం తర్వాత కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ అనుబంధం మరింత స్ట్రాంగ్ అయింది. ఇక ఇప్పుడు హరికృష్ణ కూడా లేకపోవడంతో ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ కెరీర్ కు పూర్తి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. కళ్యాణ్ రామ్ తన సొంత బ్యాన‌ర్లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై సినిమాలు నిర్మించి ఆర్థికంగా నష్టపోయారు.

అదే సమయంలో తాను నటించిన ఓం సినిమా డిజాస్టర్ అవ్వగా కళ్యాణ్ రామ్ కు భారీ నష్టాలు మిగిల్చింది. ఆ తర్వాత రవితేజ హీరోగా నిర్మించిన కిక్ 2 సినిమా కూడా ఘోరంగా దెబ్బతింది. ఈ రెండు సినిమాలతో కళ్యాణ్ రామ్ భారీగా అప్పుల్లో కూరుకుపోయాడు. దీంతో ఎన్టీఆర్ తాను పెట్టుబడి పెట్టడంతో పాటు రెమ్యూనరేషన్ తీసుకోకుండా కళ్యాణ్ రామ్ కు జై లవకుశ సినిమా చేసి పెట్టారు. ఈ సినిమాను రీజనబుల్ రేట్లకే విక్రయించారు. జై లవకుశ సూపర్ హిట్ అవడంతో కళ్యాణ్ రామ్ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు.

ఇక తాజాగా వచ్చి హిట్ అయిన బింబిసార సినిమాకు కూడా ఎన్టీఆర్ స్వయంగా పెట్టుబడి పెట్టారని టాక్. దీంతో పాటు తాను నటించే కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌ రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులలోను కళ్యాణ్ రామ్‌ను నిర్మాణ భాగస్వామిగా చేశారు. ఈ రెండు సినిమాలకు కూడా ఎన్టీఆర్ స్వయంగా పెట్టుబడి పెడుతున్నాడట. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అయితే కళ్యాణ్ రామ్ ఇక నిర్మాతగా వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం ఉండదు.

ఇక జై లవకుశ సినిమాకు ముందు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్‌కు రు. 12 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసినట్టు కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా అప్పట్లో సమాచారం బయటకు వచ్చింది. ఏదేమైనా నాడు తన తాతలు ఎన్టీఆర్ – త్రివిక్రమరావు బంధం ఎంత గొప్పగా ఉండేదో ఇప్పుడు తన సోదరుడితో జూనియర్ ఎన్టీఆర్ అనుబంధం కూడా అంతే గొప్పగా ఉంటుందని చెప్పాలి. అన్నదమ్ముల అనుబంధం అనేది మాటలతో మాత్రమే కాకుండా చేత‌ల‌తో కూడా ఎన్టీఆర్ చేసి చూపిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news