Moviesఆ విషయంలో మా ఆయన పెద్దగా ఏం కష్టపడలేదు..సుహాసిని మాటలకు నవ్వుకుంటున్న...

ఆ విషయంలో మా ఆయన పెద్దగా ఏం కష్టపడలేదు..సుహాసిని మాటలకు నవ్వుకుంటున్న జనాలు..!!

సుహాసిని.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన అందంతో తన సహజ సిద్ధమైన నటనతో ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన బ్యూటీ. అప్పట్లో సుహాసిని పేరు చెప్తే కుర్రాళ్ళు ఏదో పూనకాలు వచ్చినట్టు ఊగిపోయేవారు. చాలామంది కలల రాకుమారిగా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సుహాసిని ..ప్రజెంట్ సీనియర్ హీరోయిన్ గా ..చేతికి వచ్చిన సినిమాలలో నచ్చిన పాత్రలు పోషిస్తూ నటిగా తన జీవనాన్ని కొనసాగిస్తుంది.

మనకు తెలిసిందే.. సుహాసిని ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్ల లవ్ స్టోరీ ఇండస్ట్రీలో సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మణిరత్నం డైరెక్షన్ లో సుహాసిని సినిమాలు చేసే టైంలో వీళ్లిద్దరు లవ్ లో పడ్డారని గాసిప్స్ మొదలయ్యాయి. ఆ గాసిప్స్ చూసి సుహాసిని తండ్రి తట్టుకోలేక నీకు పెళ్లి కాదు అంటూ మణిరత్నానికి ఇచ్చి పెళ్లి చేశాడట. అప్పట్లో వీళ్ల పెళ్లి సంచలనంగా మారింది. అయితే పెళ్లి తర్వాత ఈ జంట మాత్రం హ్యాపీగా కలిసి ఉన్నారు.

కాగా రీసెంట్ గా మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న మూవీ పోనియన్ సెల్వన్. హీరో విక్రమ్, కార్తీ, జయం, రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ఇలాంటి స్టార్ హీరో హీరోయిన్లను పెట్టి కనివిని ఎరుగని కాంబినేషన్ లను మిక్స్ చేసి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా పై జనాల్లో భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు మూవీ టీం. కాగా రీసెంట్ గా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సుహాసిని తన భర్త గురించి చేసిన కామెంట్స్ మీడియాలో వైరల్ గా మారాయి. హైదరాబాదులో ఎంతో ఘనంగా జరిగిన ఈ సినిమా ప్రమోషన్స్ పనుల్లో పాల్గొన్న సుహాసిని మణిరత్నం గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో భాగంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్రను తన పుట్టినఇల్లు గా ప్రస్తావించింది. అంతేకాదు “ఈ సినిమా కోసం మా వారు చాలా కష్టపడ్డారని చాలా శ్రమిస్తున్నారని ఆయనను జాగ్రత్తగా చూసుకోండి అని పలువురు నాకు మెసేజ్ చేస్తున్నారు.. మీ అందరికీ ఓ విషయం చెప్పాలి.. ఈ సినిమా కోసం మణిరత్నం అస్సలు కష్టపడడం లేదు.. ఇష్టంగా పని చేస్తున్నారు ..ఇది అయిన డ్రీమ్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఈ సినిమాతో ఆయన మరో మంచి పేరును సంపాదించుకుంటారు. ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరూ కూడా తమ లైఫ్ లో మరింత ఎత్తుకు ఎదుగుతారు..” అంటూ చెప్పుకోచ్చింది. దీంతో మణిరత్నంపై సుహాసిని చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news