Moviesఓ మై గాడ్: తెలుగు జనాలు కియారా అద్వానీని ఇంత...

ఓ మై గాడ్: తెలుగు జనాలు కియారా అద్వానీని ఇంత దారుణంగా అనుకుంటున్నారా… !

బాలీవుడ్‌లో విపరీతంగా క్రేజ్ ఉన్న హీరోయిన్స్‌లో కియారా అద్వానీ ఒకరు. ఇంకా చెప్పాలంటే గత నాలుగేళ్ళుగా బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతుందనే చెప్పాలి. లస్ట్ స్టోరీస్‌తో క్రేజ్ తెచ్చుకున్న కియారా ఆ తర్వాత బాలీవుడ్ బ్లాస్టర్ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ సినిమాతో ఒక్కసారిగా తారా స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత కియారాను అక్కడ ఎవరూ అడ్డుకోలేకపోయారు. వరుసగా బ్లాక్ బస్టర్స్ చేస్తూ స్టార్ స్టేటస్‌ను అందుకుంది. అక్షయ్ కుమార్ లాంటి సీనియర్ హీరో సరసన నటిస్తూ కూడా యంగ్ హీరోలతో రొమాన్స్ చేస్తోంది.

అయితే, కియారా తెలుగులో మాత్రం సెటిల్ అవలేకపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు. కియారా తెలుగులో నటించిన మొదటి సినిమానే భారీ హిట్ సాధించింది. చూడ‌డానికి కావాల్సినంత అందంతో పాటు చ‌క్క‌ని అభిన‌యం ఉండ‌డంతో ఆమె ఇక్క‌డ పాతుకుపోతుంద‌నే అంద‌రూ అనుకున్నారు. దాంతో వెంటనే మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన వినయ విధేయ రామ సినిమాలో అవకాశం అందుకుంది.

అయితే, ఈ సినిమా భారీ హిట్ అని అందరూ భావించారు. చివరికి అట్టర్ ఫ్లాప్ అనే టాక్‌తో మిగిలింది. ఇదే తెలుగులో కియారాకి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. మళ్ళీ తెలుగులో సినిమా చేసే అవకాశం కొంతకాలం రాలేదు. అదే సమయంలో అమ్మడు బాలీవుడ్‌లో గట్టిగా నిలదొక్కుకుంది. ఆ సమయంలో కియారాని సినిమా కోసం అడిగినా డేట్స్ సర్దుబాటు చేయలేకపోయింది. ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిపోయింది.

అయితే, కియారాని భరత్ అనే నేను సినిమాలో చూసినప్పుడు బాగానే ఫీలైన జనాలు ఆ తర్వాత వినయ విధేయ రామ సినిమాకి మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేశారు. బక్క పలచని పర్సనాలిటీతో మగరాయుడిలా కనిపిస్తుందని, హీరోయిన్‌గా కనిపించాల్సిన ఫికల్ అపీరియన్స్ లేదని మాట్లాడుకున్నారు. అంతేకాదు, ఎద అందాల ప్రదర్శన ఏంత చేసినా ఏముంది అక్కడ ..అంటూ ఘాటు కామెంట్స్ కూడా చేసిన నెటిజన్స్ ఉన్నారు.

బహుషా ఇండస్ట్రీలో కొందరు మేకర్స్ కూడా ఇదే ఫీలయ్యారా లేదా తెలీదు గానీ, తెలుగులో మళ్ళీ కనిపించకపోవడానికి ఇదీ ఒక కారణం అని చెప్పవచ్చు. మొత్తానికి మళ్ళీ దిల్ రాజు కియారాను టాలీవుడ్‌కి తీసుకువస్తున్నారు. ఆయన నిర్మాణంలో మెగా పవర్ స్టార్ రామ్మ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్సీ 15లో కియారా అద్వానీ హీరోయిన్. ఈ సినిమా హిట్ అయితే గనక పాన్ ఇండియా రేంజ్‌లో కియారా క్రేజ్ ఇంకాస్త పెరుగుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news