Moviesభర్త మరణించాక ఫస్ట్ టైం కెమారా ముందుకు వచ్చిన మీనా.. ఏం...

భర్త మరణించాక ఫస్ట్ టైం కెమారా ముందుకు వచ్చిన మీనా.. ఏం చెప్పిందో తెలుసా..?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనసైన స్టైల్ లో నటించి అలరించి..మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే..బడా బడా స్టార్ హీరోల సినిమా లో నటించి సూపర్ డూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. ఈ మధ్య సెకండ్ ఇన్నింగిస్ స్టార్ట్ చేసి..మంచి మంచి అవకాశాలు అందుకుంటున్న మీనా కి..లైఫ్ లో ఊహించని పరిస్ధితి ఎదూరైంది.

కొన్ని రోజుల క్రితమే.. మీనా భర్త విద్యా సాగర్ మరణించారు. చాలా చిన్న వయసులోనే ..ఆయన ఇలా ఆనారోగ్య కారణంగా మరణించడం ఇండస్ట్రీ ప్రముఖులను సైతం కలిచి వేసింది. అయితే, మీనా భర్త మరణించిన టైంలో..ఆమె పై రకరకాల వార్తలు హల్ చల్ చేశాయి. కానీ..వాటీన్నింటికి ఒక్క మెసేజ్ తో ఫుల్ స్టాప్ పెట్టేసింది మీనా. భర్తని పొగొట్టుకుని బాధలో ఉన్నాను దయ చేసి అర్ధం చేసుకోండి..అంటూ ఓ పోస్ట్ పెట్టింది. అయితే, అప్పటి నుండి మీడియా కంట కనపడని మీనా..తాజా బయటకు వచ్చింది.

తాను కమిట్ అయిన సినిమా షూటింగ్ లో భాగంగా మీనా షెడ్యూల్ లో పాల్గొంది. ఇక అప్పుడే ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’ సినిమా సెట్స్‌లో నటి మీనా ను కలిసింది అలీ భార్య జుబేదా. ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక అలా ఆమెతో కాసేపు సరదాగా ముచ్చతించింది. మీనా కు వీరాభిమానిని అంటూ చెప్పుకొచ్చిన జుబేదా..’పెళ్లాం చెబితే వినాలి’ సినిమా టైం లో తన్ పరీక్షలు ఎగ్గోటి మరీ ఆ సినిమా చూశాను అని గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. “చాలా రోజుల తర్వాత తెలుగు ప్రాజెక్ట్ లో నటిస్తున్నాను. ఎప్పటి నుండో ఎస్వీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో నటించాలి అనుకుంటున్నా..ఇన్నాళ్లకు కుదిరింది. ఆయన డైరెక్షన్ లో ఫస్ట్ టైం నటిస్తున్నాను. నేను తెలుగులో సినిమాలు చేయట్లేదని చాలా మంది అంటూన్నారు..మంచి స్టోరీ లు ఉంటే ఖచ్చితంగా చేస్తా..”అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news