Moviesఆయనకు రష్మికనే కావాలి..ఎప్పుడు ఆదే పిలుపు..కీర్తి మాటలకు షాక్ అయిన మహేష్..

ఆయనకు రష్మికనే కావాలి..ఎప్పుడు ఆదే పిలుపు..కీర్తి మాటలకు షాక్ అయిన మహేష్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా..మే12న గ్రాండ్ ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్పుడేప్పుడో సరిలేరు నీకెవ్వరు అంటూ కనిపించిన మహేష్ ఆ తరువాతా చాలా ఏళ్ళు గ్యాప్ తీసుకుని వస్తున్న మూవీ కావడంతో అభిమానులు ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు రావదంతో ..ప్రమోషన్స్ పనులను ఫాస్ట్ గా లాగేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే నిన్న హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.

ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ తో పాటు కీర్తి సురేష్, పరశురామ్..సర్కారు వారి పాట టీం పాల్గొన్నారు. అంతేకాదు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కూడా సందడి చేస్తున్నారు. ఈవెంట్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు ఆయన. స్టేజీ ఎక్కి మైక్ పట్టుకున్న ఆయన తనదైన స్టైల్ లో మాట్లాడుతూ మహేష్ బాబు తో పాటు అక్కడ ఉన్న జనాలని సీతం నవ్వించారు. “మహేష్ బాబు లో ఇంత జోష్ ఎప్పుడూ చూడలేదని.. ఖచ్చితంగా మహేష్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని..మహేష్ ను ఇలా చూపించిన క్రెడిట్ డైరెక్టర్ పరశురామ్ కే దక్కుతుందంటూ” మహేష్ ని, పరశూరాం ని ఆకాసానికి ఎత్తేశారు.

ఇక హీరోయిన్ కీర్తి సురేష్ మాట్లాడుతూ..కాసేపు అల్లరి అల్లరి చేసింది. సరదాగా మహేష్ ని ఆటపట్టిస్తూ..నవ్వించింది. కీర్తి మాట్లాడుతూ..”నాకు కళావతి లాంటి మంచి రోల్ ఇచ్చినందుకు డైరెక్తర్ కి థ్యాంక్స్. సినిమాలో హీరోయిన్ నేను అయితే.. డైలీ షూటింగ్ లో నా పేరు మర్చిపోయి..ఎప్పుడు రష్మిక రష్మిక అంటూ పిలిచేవారు. ఈ సినిమాలో మహేష్ గారితో వర్క్ చేసి చాలా నేర్చుకున్నాను. మహేష్ గారితో పని చేయడం నా అదృష్టం” అంటూ చెప్పుకొచ్చిన కీర్తి..ఫైనల్ గా సినిమాలో హైలెట్ గా నిలిచిన ఆయన విన్నారు. ఆయన ఉన్నారు. ఆయన మీ ముందుకి వస్తున్నారు…అంటూ చెప్పి అభిమానులను ఉత్సాహ పరిచారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news