Moviesస‌ర్కారు వారి పాటలో ఆ హీరోయిన్ అయ్యుంటే చించేసేదట..కీర్తి కైపెక్కించలేదా..?

స‌ర్కారు వారి పాటలో ఆ హీరోయిన్ అయ్యుంటే చించేసేదట..కీర్తి కైపెక్కించలేదా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెర‌కెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ స‌ర్కారు వారి పాట‌. కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూసిన సినిమా నిన్న గ్రాండ్ గా ధియేటర్స్ రో రిలీజైంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, జీఎంబీ ఎంట‌ర్టైన్‌మెంట్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఎప్పుడో రెండేళ్ల క్రితం స్టార్ట్ అయిన ఈ సినిమా క‌రోనా పాండ‌మిక్ వ‌ల్ల వాయిదా పడుతూ లేట్ గా రిలీజ్ అయిన అభిమానులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉండటంతో..సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజయాని అందుకుంది.

మరీ ముఖ్యంగా ఈ సినిమా లో మహేశ్-కీర్తి లవ్ ట్రాక్ బాగా పడింది అని అంటున్నారు అభిమానులు. వీళ్ల మధ్య వచ్చే..రొమాంటిక్ సీన్స్, ఫానీ సీన్స్..ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ఆ కాళ్లు సీన్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ సమంతను పెట్టుంటే..ఆ స్టోరీకి బాగా సెట్ అయ్యుండేది అంటున్నారు జనాలు. మహేశ్ పక్కన ఆ కధకు తగ్గ కళావతి పాత్రలో కీర్తి కన్నా కూడా సమంత అయితే పూర్తి న్యాయం చేసుండేది అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. కీర్తి సురేష్ కళావతి పాత్రలో నటించడానికి బాగా ట్రై చేసిందని..కానీ ఆ రాష్ మాటలు..ఆమె కన్నా సమంత చెప్పుంటే అద్దిరిపోయేవట.

తెర పై ఆల్రెడీ మహేశ్-సమంత జంట సూపర్ సక్సెస్ అయ్యింది. వీళ్లు దూకుడు సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ఆ సినిమాలో సమంత మహేశ్ ఫన్నీ ఫైట్ ఎంత ఆకట్టుకున్నాయో తెలిసిందే.. “భూమికి జానడు లేవు” అంటూ మహేశ్ చెప్పే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. అదే ఫార్మెట్ లో ఉంటుంది సర్కారు వారి పాట సినిమాలో కీర్తి-మహేశ్ ఫన్నీ సీన్స్. కళావతి పాత్రలో కీర్తి కైపెక్కించలేకపోయింది ..అదే సమంత అయితే రచ్చ రచ్చ గా ఉండేది అంటున్నారు ఆ పబ్ కల్చర్ కి..మహేశ్ ను కీర్తి తీటే డైలాగ్స్ కి సమంత అయితే సినిమాకి మరింత ప్లస్ అయ్యుండేది అంటూ వాళ్ల అభిప్రాయం తెలియజేస్తున్నారు నెటిజన్స్. మరి మీ దృష్టీలో మహేశ్ కి పర్ ఫెక్ట్ గా సెట్ అయిన పెయిర్ ఎవరో చెప్పండి ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news