Moviesచిరు, మ‌హేష్ వ‌ద్ద‌న్నా.. ప్ర‌భాస్ చేసిన ఫ్లాప్ చిత్రం ఏదో తెలుసా?

చిరు, మ‌హేష్ వ‌ద్ద‌న్నా.. ప్ర‌భాస్ చేసిన ఫ్లాప్ చిత్రం ఏదో తెలుసా?

`బాహుబ‌లి` సిరీస్‌తో నేష‌న‌ల్ స్టార్‌గా ఎదిగిన టాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ ప్ర‌భాస్‌.. ప్ర‌స్తుతం వ‌రుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈయ‌న ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు ఉన్నాయి. అలాగే ఫ్లాపులు ఉన్నాయి. ముఖ్యంగా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టిన చిత్రాల్లో `చ‌క్రం` ఒక‌టి.

కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న ఆసిన్‌, ఛార్మీ కౌర్ హీరోయిన్లుగా న‌టించారు. పద్మాలయా టెలీఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రం 2005 మార్చి 25న విడుద‌లైంది. ఇందులో ప్రభాస్ అందరి ముఖాల్లో నవ్వులు నింపాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ తాను మాత్రం ఒంటరే. తనకు క్యాన్సర్ ఉన్న విషయాన్ని దిగమింగుతూ.. జనాలకు సంతోషాన్ని పంచాలని భావిస్తాడు. చివ‌రాఖ‌ర‌కు అనంత‌ లోకాల‌కు వెళ్లిపోతాడు.

 

అయితే నిజానికి అప్పటి తెలుగు సినిమాల్లో హీరో చనిపోతే ప్రేక్షకులు చూడరు అనే నానుడి ఉంది. అందుకే ప్ర‌భాస్‌ను ఈ సినిమా చేయ‌వ‌ద్ద‌ని స‌న్నిహితులు సూచించారట‌. పైగా అప్ప‌టికే ఈ మూవీ చిరంజీవి, మ‌హేష్ బాబు, గోపీచంద్ వంటి హీరోల వ‌ద్ద‌కు వెళ్ల‌గా.. తాము ఈ సినిమా చేయడానికి సాహ‌సం చేయ‌లేమ‌ని చెప్పేశార‌ట‌.

చిరు, మ‌హేష్‌లు వ‌ద్ద‌న్న సినిమాను మొహమాటానికి పోయి ప్రభాస్ టేక‌ప్ చేశాడు. క‌ట్ చేస్తే భారీ అంచ‌నాల న‌డుమ‌ రిలీజ్ అయిన ఈ మూవీ.. ఫ్లాప్‌ను మూట‌గ‌ట్టుకుని నిర్మాత‌ల‌కు, బ‌య్య‌ర్ల‌కు ఊహించ‌ని న‌ష్టాల‌ను మిగిల్చింది. హీరో చనిపోతే ప్రేక్షకులు సినిమా చూడరు అనే నానుడిని చ‌క్రం సినిమా మ‌రోసారి ర‌జువు చేసింది.

 

కాగా, ప్ర‌భాస్ ప్ర‌స్తుత సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆదిపురుష్‌`, ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో `స‌లార్‌`, నాగ్ అశ్విన్‌తో `ప్రాజెక్ట్‌-కె`, సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్‌` చిత్రాలు చేస్తున్నాడు. వీటిలో ఆదిపురుష్ షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి అయింది. అలాగే మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్లు గ‌త కొద్ది రోజుల నుంచీ వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news