Moviesబ‌న్నీ ఫ్యాన్స్ VS మ‌హేష్ ఫ్యాన్స్ వార్ మ‌రింత ముదురుతోందా..!

బ‌న్నీ ఫ్యాన్స్ VS మ‌హేష్ ఫ్యాన్స్ వార్ మ‌రింత ముదురుతోందా..!

టాలీవుడ్ స్టార్ హీరోల ఫ్యాన్స్ మ‌ధ్య గొడ‌వ‌లు ఈ నాటివి కావు. అప్ప‌ట్లోనే ఎన్టీఆర్‌, కృష్ణ అభిమానుల మ‌ధ్య పెద్ద యుద్ధాలే జ‌రిగేవి. ఆ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి, నట‌సింహం బాల‌కృష్ణ అభిమానుల మ‌ధ్య అంతే గొడ‌వ‌లు ఉండేవి. ఆ త‌ర్వాత త‌రంలో యువ హీరోలు చాలా మంది వ‌చ్చేశారు. వీరి మ‌ధ్య మ‌రీ అంత తీవ్ర‌మైన పోటీ ఉండేది కాదు. అయితే ఇప్పుడు అంతా సోష‌ల్ మీడియా యుగం. ఏ హీరో సినిమాకు ఎంత క్రేజ్ ఉంద‌న్న‌ది సోష‌ల్ మీడియాలో వ్యూస్‌, లైకులు కొల‌మానం అయిపోయాయి. దీంతో ఎవ‌రు గొప్ప‌.. ఏ హీరో సినిమా ట్రెండ్ అవుతోంద‌న్న విష‌యాలు దాయ‌డానికి అవ‌కాశం లేదు.

దీంతో హీరోల అభిమానుల మ‌ధ్య మెల్ల‌గా స్టార్ట్ అవుతోన్న గొడ‌వ‌లు.. పెరిగి పెద్ద‌వి అయిపోతున్నాయి. ఇక గ‌త రెండు, మూడేళ్ల నుంచి ఇంకా చెప్పాలంటే స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పురంలో సినిమాలు రిలీజ్‌కు ముందు నుంచి బ‌న్నీ , మ‌హేష్ అభిమానుల మ‌ధ్య గొడ‌వ‌లు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు సినిమాల‌ను మేక‌ర్స్ పోటీ ప‌డి మ‌రీ ఒకే రోజు రిలీజ్ చేయాల‌ని డేట్లు వేసుకున్నారు. పోస్ట‌ర్లు కూడా రిలీజ్ చేసుకున్నారు.

ఈ విష‌యంలో ఎవ్వ‌రూ వెన‌క్కు త‌గ్గ‌లేదు. చివ‌ర‌కు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు, దిల్ రాజు లాంటి వాళ్లు సిట్టింగ్‌లు వేసి మ‌రీ రాజీ కుదిర్చి ఒక రోజు తేడాలో రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశారు. అయితే ఈ ఇద్ద‌రు హీరోల అభిమానుల మ‌ధ్య అప్ప‌టి నుంచి ప్ర‌తి సంద‌ర్భంలోనూ సోష‌ల్ మీడియా వేదిక‌గా యుద్ధం న‌డుస్తూనే ఉంది. ఇది ప‌రోక్షంగా ఆయా హీరోల‌ను కూడా తాకింది.

 

అల‌, స‌రిలేరు సినిమాల రిలీజ్ టైంలో పోటీలు ప‌డి మ‌రీ క‌లెక్ష‌న్ల వివ‌రాలు వెల్ల‌డించేసుకున్నారు. చివ‌రి వ‌ర‌కు త‌మ సినిమా గొప్పంటే.. త‌మ సినిమాయే గొప్ప‌ని ఒక్క‌టే ప్ర‌చారం చేసుకున్నారు. అయితే అల సినిమాకు లాంగ్ ర‌న్ ఎక్కువుగా ఉండ‌డంతో ఆ సినిమా చివ‌ర‌కు పై చేయి సాధించింది. అలా ఆ యేడాది సంక్రాంతి విన్న‌ర్‌గా నిలిచింది.

ఇక ఆ త‌ర్వాత బ‌న్నీ పుష్ప సినిమా వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌హేష్ సినిమా రిలీజ్ కాలేదు. అయితే ఇప్పుడు మ‌రోసారి ఈ ఇద్ద‌రు హీరోల అభిమానుల వార్ ముదురుతోన్న వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తోంది. బ‌న్నీ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా సంగీతాన్ని థ‌మ‌న్ మ‌హేష్‌బాబు సినిమాకు వాడేసుకున్నాడ‌ని బ‌న్నీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. థ‌మ‌న్ నుంచి ఒరిజిన‌ల్ మ్యూజిక్ తీసుకుంటే మంచిద‌ని చెప్ప‌డంతో పాటు మ‌హేష్‌బాబుపై కూడా కామెంట్లు చేస్తున్నారు.

 

ఇక ఇప్పుడు త్రిబుల్ ఆర్ ప్ర‌మోష‌న్ల‌లో చ‌ర‌ణ్‌, తార‌క్ బెస్ట్ ఫ్రెండ్స్‌లా క‌లిసి మెలిసిపోయారు. ఇప్పుడు గ్రౌండ్ లెవ‌ల్లో కూడా ఎన్టీఆర్‌, చెర్రీ అభిమానులు అలాగే క‌లిసిపోయారు. మ‌హేష్ – బ‌న్నీ కూడా ఈ విష‌యంలో చొర‌వ తీసుకోక‌పోతే ఈ ఇద్ద‌రు హీరోల అభిమానుల వార్ అలాగే కొన‌సాగితే అది ఇద్ద‌రికి మైన‌స్సే అవుతుంది. అయితే కొద్ది రోజుల క్రితం ఓ పార్టీలో బ‌న్నీ భార్య స్నేహ‌, మ‌హేష్ భార్య న‌మ్ర‌త క‌లిసిపోయారు. అలా ఈ ఇద్ద‌రు హీరోలు కూడా తార‌క్… చెర్రీ స్టైల్లో క‌లిస్తే ఫ్యాన్స్ మ‌ధ్య ఈ ఇగోలు, గిగోలు ఉండ‌వు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news