Moviesఅభిమానుల్లో బిగ్ టెన్షన్..ప్రభాస్ కు పొంచి ఉన్న ప్రమాదం?

అభిమానుల్లో బిగ్ టెన్షన్..ప్రభాస్ కు పొంచి ఉన్న ప్రమాదం?

గత రెండు సంవత్సరాలుగా ఓ శత్రువు మనల్ని పట్టి పీడిస్తుంది. దాని పేరే కరోనా..మాయదారి మహమ్మారి మానవాళి పై పగబట్టిన్నట్లు ఉంది. ఏ ముహుర్తానా ఇండియలోకి ప్రవేశించిందో కానీ ఇది సృష్టించిన అనార్ధాలు..తెచ్చి పెట్టిన శోకం ..మిగిల్చిన కడుపు కోత అంతా ఇంతా కాదు. భర్తకు భార్యని, తల్లిదండ్రులకు పిల్లలని..కుటుంబానికి ఇంటి పెద్దని..లేకుండా చేసింది.

నిజం చెప్పాలంటే కరోనా మొదటి వేవ్ లో దీని ప్రభావం తక్కువ చూపించినా..రెండో వేవ్ లో మాత్రం నరకం అంటే ఇలానే ఉంటుందా అన్నట్లూ..లైవ్ లో చూయించింది. కళ్ల ఎదుటే అయిన వారి ప్రాణాలు పోతున్న ఏం చేయలేని దిక్కుతోచని స్ధితిలోనే ఉండిపోయాం. ఈ రెండో వేవ్ లోనే సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడి ఎక్కువమంది చనిపోయారు. సరే ఈ దరిద్రం వదిలిపోయింది. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి మళ్ళీ మనకి మంచి రోజులు వచ్చాయి అనుకుంటున్న క్రమంలోనే మళ్లీ కరోనా కేసులు వెలుగు చూడటం గమనార్హం.

రీసెంట్ గా స్టార్ డాటర్ శృతి హాసన్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేస్తూ.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కోవిడ్ పాజిటివ్ వచ్చిందని.. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నానని.. త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటానని చెబుతూ శ్రుతి హాసన్ పోస్ట్ చేశారు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది.

ఎందుకంటే ఆమెకు కోవిడ్ వచ్చే మూడు నాలుగు రోజులు ముందు వరకు కూడా సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొంది అంటా. అందులోను ప్రభాస్ తో క్లోజ్ సీన్స్ షూట్ చేశారని తెలుస్తుంది. దీంతో ప్రభాస్ కి కూడా ఎక్కడ కరోనా సోకు ఉంటుందో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ప్రభాస్ కి కరోనా నెగిటివ్ రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news