Moviesమరీ ఓవర్ చేస్తున్న రష్మిక..తప్పులేద..తప్పలేదా..?

మరీ ఓవర్ చేస్తున్న రష్మిక..తప్పులేద..తప్పలేదా..?

జనరల్ గా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు ఒక్క సినిమా హిట్ అయితేనే ..వెంటనే రెండో సినిమాకి భారీ స్దాయిలో రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు. అలాంటిది వరుసుగా హిట్ సినిమాలు పడితే..ఆ హీరోయిన్ ఏం చేస్తుంది..బలుపు ఎక్కువ అవుతుంది..తలపొగరు మించి పోతుంది..రెమ్యూనరేషన్ పెంచేసి..తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ నిర్మాతలకే చుక్కలు చూయిస్తుంది.. అంటున్నారు సినీ పెద్దలు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకే వస్తుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా..

ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆ తరువాత చల్ చల్ ఛలో అంటూ ఎక్కడ ఆగకుండా రైయ్ రైయ్ మని దూసుకుపోతుంది. దానికి తగ్గట్లే అమ్మడుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం..నేషనల్ క్రష్ గా మారిపోవడంతో..బడా స్టార్స్ కళ్ళు కూడా ఆమె పై పడ్డాయి తద్వారా..అటు బాలీవుడ్ లోను అవకాశాలు అందుకుని..బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

అయితే రీసెంట్ గా పుష్ప సినిమా హిట్ అయిన తరువాత అమ్మడు కొంచె టెక్ ఎక్కువ చూయిస్తుందట. స్టోరీ చెప్పడానికి ఇంటికి వస్తున్న డైరెక్టర్లకి ముందే తన రెమ్యూనరేషన్ చెప్పి పట్టపగలే చుక్కలు చూయిస్తుందట. అంతేనా..ఆమె రేంజ్ రెమ్యూనరేషన్ ఇవ్వగలిగే వాళ్లని మాత్రమే లోపలికి రానిస్తూ స్టోరీ లు విని..దానికి తగ్గ డిమాండ్ చేస్తుందట. ఈ క్రమంలో నే అమ్మడుకి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందని..కానీ తలపొగరు తో ఆ సినిమాని మిస్ చేసుకుందనే వార్త నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది.

రీసెంట్‌గా ఉమెన్‌ సెంట్రిక్‌ మూవీ కోసం గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ సం‍ప్రదించినప్పుడు..రష్మిక అంత బాగానే ఉంది అని స్టోరి నచ్చిందని కానీ పారితోషం జీఎస్టీతో కలిపి రూ. 3కోట్ల పైనే కావాలని డిమాండ్‌ చేసిందట. దీంతో షాకైన అల్లు అరవింద్..ఏం మాట్లాడకుండా బయటకు వచ్చేశారట. ఇక ఈ విషయం పై రష్మిక అభిమానుల్లో భిన్న విభిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరమో దీపం ఉన్నపూడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటుంటే..మరి కొందరు ఏమో రష్మిక చేసిన దాంట్లో తప్పులేదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news