Moviesసిద్ధార్థ్‌ నోటి దూల..ఆ ఒక్క మాటతో పరువు పాయే..?

సిద్ధార్థ్‌ నోటి దూల..ఆ ఒక్క మాటతో పరువు పాయే..?

హీరో సిద్ధార్థ్ ఒక్కప్పుడు మనల్ని తన నటనతో ఎంత ఎంటర్ టైన్ చేసి మంచి హీరోగా మంచి నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే గత కొంత కాలంగా సరైన అవకాశాలు లేక వెనకపడిన హీరో సిద్ధార్థ్.. ఇటీవల సోషల్ మీడియాలో రాజకీయ నాయకులపై సూటిగా సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లపై ధైర్యంగా ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశాడు. దానికి పరిశ్రమ నుంచి గొప్ప స్పందన వచ్చింది.

తాజాగా అతడు భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై వేసిన పంచ్ హాట్ టాపిక్ గా మారింది. పంజాబ్ లో మోదీ ని రోడ్ పైనే రైతులు నిర్భంధించిన క్రమంలో సెక్యూరిటీ సరిగా లేదంటూ సోషల్ మీడియాల్లో డిబేట్ రన్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌ని పంజాబ్‌లో అడ్డగించడాన్ని సైనా నెహ్వాల్ ఖండించింది. ఇక దీని పై తనదైన స్టైల్లో రెస్పాండ్ అవుతూ..సోషల్ మీడియా వేదికగా స్పందించింది సైనా. అదే క్రమంలో సిద్ధార్థ్ ఆమె ట్వీట్ కు రిప్లై ఇస్తూ వ్యంగ్యంగా స్పందించడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

ప్రధాని మోడీ భద్రతా వైఫల్యంపై స్పందిస్తూ స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ ట్వీట్‌ చేశారు. ప్రధాని మోదీపై దాడికి యత్నించడం పిరికి పంద చర్య. ప్రధానిపైనే దాడి యత్నం జరిగితే ఆ దేశం భద్రంగా ఉన్నట్టు ఎలా భావించగలం’ అని ఆమె ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై సిద్ధార్థ్ స్పందిస్తూ.. ‘ఓ చిన్న కాక్ తో ఆడే ఆటలో ప్రపంచ చాంపియన్… దేవుడి దయ వల్ల మనకు దేశాన్ని కాపాడేవాళ్లున్నారు’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.

ప్రధానంగా మోడీ వ్యతిరేకి అయిన సిద్ధార్థ్ బ్యాడ్మింటన్ క్రీడలో పదజాలాన్ని వాడుతూ సైనాపై బాహాటంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీనిపై మహిళా సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సిద్ధార్థ్‌ ట్వీట్‌ సైనాను అవమానించే రీతిలో ఉందంటూ పలువురు ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా దీనిపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద స్పందిస్తూ సిద్ధార్థ్‌ వ్యాఖ్యలను తప్పబట్టింది. ఇంత మర్యాద, సంస్కారం తెలియని వ్యక్తి ట్విటర్ ఎక్కౌంట్ ఇంకా ఎందుకు బ్లాక్ చేయలేదని ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సిద్ధార్ధ్ పై కేసు నమోదు చేయాలని అటు జాతీయ మహిళా కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ‘గతంలో మహిళలు పోరాడే అనేక అంశాల్లో సిద్ధార్థ్ ఎంతో మద్దతు ఇచ్చాడు, ఇప్పుడిలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం.ఇది ఎంతో మూర్ఖత్వం’ అంటూ చిన్మయి సిద్ధార్థ్‌పై మండిపడింది. అయితే తాను చేసిన వ్యాఖ్యలకు డబుల్ మీనింగ్ తీయొద్దంటూ సిద్ధార్ధ్ కౌంటర్ ట్వీట్ చేశాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news