Moviesఆ రెండు నెలలు పూర్ణకి ఏమైంది.. ఎందుకు భయం భయంగా గడిపింది..!!

ఆ రెండు నెలలు పూర్ణకి ఏమైంది.. ఎందుకు భయం భయంగా గడిపింది..!!

టాలీవుడ్ హీరోయిన్స్ లో టాలెంటెడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు వారిలో పూర్ణ ఒకరు. ఈ అమ్మడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. దూసుకుపోతుంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సీమ టపాకాయ్’ సినిమాతో తెలుగు వారికి పరిచయం.. ‘అవును’, ‘లడ్డుబాబు’, ‘అవును 2’ మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఈ బ్యూటీ విలన్ రోల్స్ చేయడానికి సిద్దమవుతుంది. నటనకు ప్రాధాన్యత ఉంటే నెగిటివ్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అంటుంది.

తెలుగుతో పాటు తమిళం, మలయాళీ భాషల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది నటి పూర్ణ. ప్రస్తుతం ఈ బ్యూటీ నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. కేవలం హీరోయిన్ గానే నటించాలనే ఆంక్షలు పెట్టుకోకుండా మంచి పాత్ర దొరికితే నటించడానికి సిద్ధం కావడంతో ఆమెకి అవకాశాలు వస్తున్నాయి.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ.. రీసెంట్ గా అఖండ సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. కలెక్టర్ ఆఫీస్ లో విలన్ చేసే అరాచకాలను బయట పెట్టే పాత్రలో నటించిన పూర్ణ..అఖండ సినిమాలో వరదరాజులుగా చేసిన శ్రీకాంత్ తో కలిసి.. రీసెంట్ గా ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ కి వచ్చి సినిమా గురించి బోల్డెన్ని విశేషాల్ని షేర్ చేసుకున్నారు.

ఈ క్రమంలో పూర్ణ తన వ్యక్తిగత విషయాలు గురించి మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది.రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అవును సినిమా విడుదలైన తరువాత ఆమె దాదాపు రెండు నెలలపాటు నిద్రపోలేదు అని చెప్పుకొచ్చింది. స్నానం చేసేటప్పుడు కూడా ఏదో అలజడి వినిపించినట్లు ఉండేది అని.. ప్రతి క్షణం భయం భయంగా రెండు నెలలు గడిపాను ఆలీ తో తెలిపింది.

ఇలాంటి భయంకరమైన రోజులు నా జీవితంలో ఎప్పుడూ కూడా అనుభవించ లేదంటూ ఆమె తెలిపింది.ఇక అఖండ సినిమా గురించి మాట్లాడుతూ.. “ఆయనతో సినిమా అనగానే మొదట భయపడ్డాను. కానీ ఆయన చాలా మంచి వ్యక్తి.. ఆయన లాంటి వ్యక్తులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.. జై బాలయ్య అంటూ పూర్ణ వెల్లడించింది. అఖండ సినిమా ఆడియో ఈవెంట్ లో కూడా బాలయ్య సినిమాలో నటించే అవకాశం వచ్చిందని ఆమె తెగ సంబరపడింది. ఇన్నాళ్ళకు బాలయ్యతో కలిసి నటించాలనే తన డ్రీమ్ నెరవేరిందని అన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news