Moviesఆ సినిమా చేసాకనే చనిపోతా అన్న ANR..బయటపడ్డ షాకింగ్ నిజాలు..!!

ఆ సినిమా చేసాకనే చనిపోతా అన్న ANR..బయటపడ్డ షాకింగ్ నిజాలు..!!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరావు గారికి ఓ ప్రత్యేకమైన స్ధానం ఉంది. సినీ వినీలాకాశంలో ధృవతారలా వెలిగిన గొప్ప నటుడు డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు. యావత్‌ప్రపంచం గర్వపడేలా అగ్రకథానాయకుడిగా విరాజిల్లిన కళామతల్లి ముద్దుబిడ్డ ఏఎన్‌ఆర్‌. దేవదాసు అయినా, కాళిదాసు అయినా, అమర ప్రేమికుడైనా ఆయనొక లెజెండ్‌. అందుకే అనేక అవార్డులు ఆయనకు సలాం చేశాయి. ఏఎన్ఆర్‌ అంటే తరతరాలకు తరగని గని. ఆయన సినిమాలు, పాత్రలు గొప్ప పాఠాల్లాంటివి. తెలుగు సినిమా కీర్తిని నలుదిశలా చాటిన ఘనత ఆయనది.

ఎన్నో గొప్ప సినిమాల్లో నతించిన నాగేశ్వరావు గారు చివరిగా మనం అనే సినిమాల్లో నటించారు. ఇక ఇదే విషయమై హీరోయిన్ శ్రియ మీడియాతో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కొత్త లేడీ డైరెక్టర్ సుజనా రావు దర్శకత్వంలో “గమనం” అనే సినిమాలో కీలకపాత్రను పోషిస్తోంది శ్రీయ. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన శ్రియ తన వ్యక్తిగత విషయాల తో పాటు ప్రముఖ సీనియర్ స్టార్ హీరో ఏఎన్ఆర్ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది.

మీడియ తో శ్రియ ఏఎన్ఆర్ గురించి మాట్లాడుతూ..” ఆయన లాంటి గొప్ప నటుడు సినీ ఇండస్ట్రీలో మరొకరు లేరంటూ చెప్పుకొచ్చింది. ఇక నాగేశ్వరావుతో మనం సినిమాలో కలిసి నటించిన శ్రియ.. ఆయన ఎప్పుడూ తనతో ఒక మాట చెబుతూ ఉండేవాడని అంటూ.. “నేను నా కుటుంబంతో కలిసి ఒక సినిమా తీసిన తర్వాత చనిపోతాను.. అప్పటివరకు నా యాక్టింగ్ కు పులిస్టాప్ పలకను” అని శ్రియ తో చాలా సార్లు చెప్పేవారట. అంతేకాదు మనం సినిమా చేసిన తర్వాతనే నేను చనిపోతాను అని ఏఎన్నార్ తనతో అన్నారని శ్రీయ తెలిపింది. ప్రస్తుతం శ్రియ మాటాలు నెట్టింట వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news