Moviesఆ హీరోను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.. ఇండ‌స్ట్రీలో ఏం జ‌రుగుతోంది...!

ఆ హీరోను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.. ఇండ‌స్ట్రీలో ఏం జ‌రుగుతోంది…!

కోలీవుడ్ యంగ్ హీరో శింబు కెరీర్ గ‌త కొంత కాలంగా అస్త‌వ్య‌స్తంగానే ఉంది. గ‌త ప‌దేళ్లుగా శింబు కెరీర్ అంతా వివాదాల మ‌యంగానే ఉంటోంది. స్టార్ హీరోయిన్ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు ప్రేమ‌లో ప‌డ‌డం.. ఆ త‌ర్వాత బ్రేక‌ప్‌లు ఇటు కెరీర్ ప‌రంగా చూస్తే వ‌రుస ప్లాపులు అన్ని శింబును మైన‌స్ చేసేశాయి. ఒకానొక టైంలో కోలీవుడ్‌లో తిరుగులేని స్టార్ హీరో అవుతాడు అనుకున్న శింబు ఇప్పుడు ప్లాప్ హీరోగా మారిపోయాడు. ఒక‌ప్పుడు శింబు సినిమా వ‌స్తుందంటే కోలీవుడ్లో తిరుగులేని క్రేజ్‌తో పాటు ఓ పండ‌గ వాతావ‌ర‌ణం ఉండేది. అయితే ఇప్పుడు శింబు సినిమా వ‌స్తుందంటే చాలు ప‌ట్టించుకునే వాళ్లు కూడా ఉండ‌డం లేదు.

ఈ క్ర‌మంలోనే శింబు న‌టించిన మానాడు సినిమా ఈ నెల 25న రిలీజ్ అవుతోంది. వెంక‌ట్ ప్ర‌భు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో శింబు మాట్లాడుతూ వేదిక మీదే క‌న్నీళ్లు పెట్టుకున్నారు. త‌న‌ను కావాల‌ని కొంద‌రు ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆయ‌న ఒక్క‌సారిగా ఏడ్చేశారు. ఈ సినిమా కోసం తాను ఎంతో క‌ష్ట‌ప‌డ్డాన‌ని.. వెంక‌ట్ ప్ర‌భుతో ఎప్పుడో సినిమా చేయాల్సి ఉన్నా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా ఆల‌స్యం అయ్యింద‌ని చెప్పాడు.

అప్ప‌టి వ‌ర‌కు ఎంతో స‌ర‌దాగా మాట్లాడిన శింబు ఒక్క‌సారిగా క‌న్నీళ్లు పెట్టుకోవ‌డంతో అక్క‌డ ఉన్న వాళ్లంతా ఒక్క‌సారిగా ఉద్వేగానికి లోన‌య్యి శింబును ఓదార్చారు. ఇక త‌న‌కు వ‌స్తోన్న ఇబ్బందుల‌ను తాను చూసుకుంటాన‌ని.. త‌న సంగ‌తి మాత్రం త‌న అభిమానులే చూసుకోవాల‌ని శింబు చెప్పాడు. ఇక టైంకు షూటింగ్‌కు రాక‌పోవ‌డంతో పాటు నిర్మాత‌ల‌తో గొడ‌వ‌లు.. ఇవ‌న్నీ ఉండ‌డంతో తమిళ్ ప్రొడ్యుస‌ర్స్ కౌన్సెల్ కూడా చివ‌ర‌కు విసిగిపోయి శింబుపై కొద్ది రోజుల పాటు నిషేధం విధించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news