Moviesఈమె జీవితం నాశనం అవ్వడానికి కారణం ఆ డైరెక్టర్ నే..ఏం చేసాడో...

ఈమె జీవితం నాశనం అవ్వడానికి కారణం ఆ డైరెక్టర్ నే..ఏం చేసాడో తెలుసా..?

ఇండో అమెరికన్ సినీనటి పార్వతి మెల్టన్. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేసింది కొన్ని సినిమాలే అయినా..తన నటనతో అందరిని ఫిదా చేసింది. 2005లో దేవా కట్టా తెరకెక్కించిన వెన్నెల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ఎన్నారై బ్యూటీ .. బ్లాక్ బస్టర్ సినిమాలు అందుకోలేకపోయిన..మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటించి అభిమానుల దగ్గర మంచి మార్కులు వేయించుకుంది. ఇక వెన్నెల సినిమా తర్వాత చాలా సినిమాలో నటించింది. కానీ పెద్దగా పుర్తింపు పొందలేదు. అయినా కానీ తెలుగు, తమిళంలో వరుస అవకాశాలు అందుకుంది.

2008వ సంవత్సరంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాలో ను ఈ అమ్మడు కనువిందు చేసింది. అంతేనా పవన్ తో ధీటుగా స్టెప్పులు కూడా వేసింది. ఈ చిత్రం మంచి హిట్ అయినప్పటికీ పార్వతి మెల్టన్ సినీ కెరీర్ ను మాత్రం మలుపు తిప్పలేక పోయింది. మహేష్ బాబు దూకుడు సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్ తప్ప ఆమె మరే అవకాశం కూడా దక్కించుకోలేక పోయింది.ఇక ఈమె చివరిగా నటించిన చిత్రం బాలకృష్ణ హీరోగా వచ్చిన శ్రీమన్నారాయణ. ఇక అప్పటి నుంచి సినీ పరిశ్రమలో కనిపించకపోగా .. ఆమె పెళ్లి చేసుకొని సినిమాలకు చెక్ పెట్టేసిందని అర్థమవుతుంది. షాంసు లలాని అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుని ప్రస్తుతం అమెరికాలో స్థిరపడి పోయింది పార్వతి మెల్టన్.

కాగా పార్వతీ మెల్టన్ టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ బడా దర్శకుడుతో ప్రేమలో పడిందని కానీ అప్పటికే ఆ దర్శకుడికి పెళ్లయ్యి పిల్లలు కూడా ఉన్నారని దాంతో పెళ్లికి నిరాకరించడంతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని వదిలి పెట్టి దూరంగా వెళ్ళిపోయిందని అప్పట్లో పలు వార్తలు హల్ చల్ చేసాయి. కాగా అయితే సినిమా రంగంలో టాలీవుడ్ దర్శకుడు చేసిన మోసం వల్లనే తన కెరీర్ ఇలా అయిందని ఆమె ఓ ఇంటర్వ్యులో కూడా చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news